Home » జడేజా పై సీఎస్కే అధికారి షాకింగ్ కామెంట్స్…!

జడేజా పై సీఎస్కే అధికారి షాకింగ్ కామెంట్స్…!

by Azhar
Ad

టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ లో కూడా చాల కీలకమైన ఆటగాడు అనేది అందరికి తెలిసిందే. ఐపీఎల్ లో ఎప్పటినుండో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న జడేజా వచ్చే ఏడాది ఆ జట్టుతో ఉండడు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ అనేది ప్రారంభం కావడానికి రెండు రోజులు ఉంది అనగా.. చెన్నై కెప్టెన్సీని జడేజాకు అప్పగించింది యాజమాన్యం. కానీ ఈ ప్లాన్ అనేది పని చేయలేదు. జడేజా కెప్టెన్ గా ప్లేయర్ గా విఫలమయ్యాడు. అందువల్ల సీజన్ మధ్యలో అతడిని తప్పించి మళ్ళీ కెప్టెన్ గా ధోనిని నియమించింది.

Advertisement

ఇక అప్పటినుండే జడేజాకు మరియు చెన్నై జట్టు యాజమాన్యానికి మధ్య విబేధాలు అనేవి మొదలైనట్లు తెలుస్తుంది. ఇక అందుకే తగినట్లే ఐపీఎల్ 2022 సీజన్ చివర్లో జడేజా గాయం పేరుతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో ఈ వార్తలు నిజం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అప్పుడే సీఎస్కే జర్రు అధికారులు మాట్లాడుతూ.. జడేజా వచ్చే ఏడాది కూడా మా జట్టుతోనే ఉంటాడు అని పేర్కొన్నారు. అయితే తాజాగా జడేజా తన ఇంస్టాగ్రామ్ ఖాతానుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన అన్ని పాట్స్ అనేవి డిలీట్ చేసాడు.

Advertisement

దాంతో ఒక్కసారిగా ఈ విషయం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కారణంగా మళ్ళీ ఇప్పుడు ఓ సీఎస్కే అధికారి జడేజా చేసిన పని గురించి స్పందించాడు. ఆ సదరు అధికారి మాట్లాడుతూ.. జడేజా ఏం పని చేసిన అది అతని వ్యక్తిగత విషయం అనేది అందరికి గుర్తుంచుకోవాలి. ఇక మా తరపు నుండి అయితే ఏం లేదు. మాకు జడేజాకు మధ్య ఏం విబేధాలు లేవు. ఇలాంటి విషయాల పైన ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడకూడదు అని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే ఈయన ఇక్కడ వచ్చే ఏడాది జడేజా మా జట్టుతోనే ఉంటాడు అని చెప్పకపోవడంతో… జడేజాను ఐపీఎల్ 2023 లో వేరే జట్టు తరపునా చూడవచ్చు అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ పరుగులు చెయ్యాలా.. అయితే ఇలా చెయ్యండి..!

అండర్ కవర్ ప్రేక్షకులు.. కొత్త ఆలోచనతో వచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!

Visitors Are Also Reading