Home » దీపావ‌ళికి ఎల‌క్ట్రిక్ బైకులు..ఉద్యోగులను స‌ర్ప్రైజ్ చేసిన య‌జ‌మాని..1

దీపావ‌ళికి ఎల‌క్ట్రిక్ బైకులు..ఉద్యోగులను స‌ర్ప్రైజ్ చేసిన య‌జ‌మాని..1

by AJAY
Ad

దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు ఇస్తుంటాయి. అంతే కాకుండా ఇతర గిఫ్ట్ ల‌ను కూడా ఇచ్చి ఉద్యోగులను సంతోష పెడుతుంటాయి. కాగా సూరత్ కు చెందిన ఓ కంపెనీ యజమాని ఉద్యోగులకు గిఫ్ట్ లు ఇవ్వడంతోపాటు కాలుష్యాన్ని నివారించే నిర్ణయం తీసుకున్నారు. సూరత్ కు చెందిన అలియన్స్ అనే సంస్థ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తోంది. ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. అయితే కంపెనీ ఎదుగుదలలో ఎంతో తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని నిర్ణయించుకున్నారు.

Advertisement

company gifts electric scooters to employees

company gifts electric scooters to employees

ఈ నేపథ్యంలో దీపావళి పండుగకు వారి ముఖాల్లో సంతోషాన్ని నింపాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి దీపావళి కానుకగా ఎలక్ట్రిక్ బైక్ లను గిఫ్ట్ గా అందించాలని నిర్ణయించుకున్నాడు. దానికి కారణం ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల‌తో పాటూ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందని ఆలోచించాడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే కంపెనీలోని మొత్తం 35 మంది ఉద్యోగులకు ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ లను గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ ఒక్క స్కూటర్ ధర రూ.76,848 గా ఉంది. ఈ స్కూట‌ర్ మూడు గంటలు ఛార్జ్ చేస్తే బ్యాట‌రీ ఫుల్ అవుతుంది. బ్యాట‌రీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 88 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ మైలేజీ ఇస్తుంది. ఇక‌ తమ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి వెళ్ళడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ కంపెనీ య‌జ‌మాని చెబుతున్నారు.

Visitors Are Also Reading