Home » జబర్దస్త్ యాజమాన్యం నన్ను మోసం చేసింది…

జబర్దస్త్ యాజమాన్యం నన్ను మోసం చేసింది…

by Azhar
Ad

బుల్లితెర పైన వచ్చే జబర్దస్త్ కు ఎంత ఫెమ్ ఉంది అనేది అందరికి తెలిసిందే. 2013 లో ప్రారంభమైన ఈ కామెడీ షో విజయవంతంగా ఇప్పటివరకు నడుస్తుంది. ఇక ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకీ పరిచయం కాగా… అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న వారికీ మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ షోకు పోటీగా ఎన్ని షోలు వచ్చిన దీనిని తట్టుకొని నిలబడలేకపోయాయి. కానీ దాదాపు గత ఏడాది కాలంగా జబర్దస్త్ షోకు గడ్డు కలం నడుస్తుంది. రేటింగ్స్ క్రమంగా పడిపోతున్నాయి.

Advertisement

మొదట నాగబాబు ఈ షో నుండి వెళ్లిపోయిన తర్వాత ఆయన వెనుకే కొంత మంది వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మంత్రిగా అవకాశం రావడంతో జబర్దస్త్ నుండి రోజా తప్పుకుంది. అదే పెద్ద దెబ్బ అనుకుంటున్న సమయంలో జబర్దస్త్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న హైపర్ ఆది తో పాటుగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరు కూడా తప్పుకున్నారు. అయితే వీరికంటే ముందే ఈ షో నుండి బయటికి వచ్చిన చాలా మంది ఈ షో యాజమాన్యం గురించి రకరకాల కామెంట్స్ చేసారు. ఇప్పుడు అందులో అప్పారావు కూడా చేరిపోయాడు.

Advertisement

కరోనా కంటే ముందు జబర్దస్త్ లో టీం లిడార్ గా కొనసాగిన అప్పారావు ఇప్పుడు ఆ షోలో చేయడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి మాట్లాడుతూ.. కరోనా ముగిసిన తర్వాత నేను వెళ్తే మీరు పెద్దవారు కదా.. కొన్ని రోజులు ఆగండి మేము పిలుస్తాం అన్నారు. కానీ పిలవలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్తే.. మీకు టీం లీడర్ ఇవ్వం. కంటెస్టెంట్ గా చేయాలి అని అన్నారు. అలా జబర్దస్త్ యాజమాన్యం నన్ను మోసం చేసింది. దాంతో నాకు అక్కడ నచ్చక నేను ఆ షో మానేసాను అని తెలిపాడు అప్పారావు.

Visitors Are Also Reading