Home » ఉపాధి కోసం వ‌చ్చి.. అనంత లోకాలకు

ఉపాధి కోసం వ‌చ్చి.. అనంత లోకాలకు

by Bunty
Published: Last Updated on
Ad

ఉపాధి కోసం సింహాచ‌లం అప్ప‌న్న కొండ కు వ‌చ్చిన యువ‌తి అనుమాన‌స్పందగా బావిలో ప‌డి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఆదివారం సింహ చ‌లం కొండ పై చోటు చేసుకుంది. యువ‌తి త‌ల్లి దండ్రుల వివ‌రాల ప్రకారం.. ఆనంద‌పూరం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన సిమ్మ స‌త్యం, ల‌క్ష్మీ ల‌కు భవానీ (22) కూతురు. భవ‌నీ బ‌తుకు దెరువు కోసం సింహ‌చ‌లం కొండ పైన ఒక దుకాణం లో ప‌ని చేస్తుంది. అయితే అదే మండ‌లం క‌ణ‌మాం గ్రామానికి చేందిన రాజు అనే అటో డ్రైవ‌ర్.. భవనిని ప్ర‌తి రోజు దుకాణం వ‌ద్ద కు తీసుకువ‌స్తాడు.. తీసుకెళ్తాడు.

Advertisement

Advertisement

అయితే ఎప్ప‌టి లాగే ఆది వారం కూడా భవాని ని రాజు సింహాచలం కు తీసుకెళ్లాడు. అయితే ఆ రోజు భ‌వాని ఇంటి కి రాలేదు. దీంతో రాజు భ‌వాని ఫోటో తీసుకుని.. సోష‌ల్ మీడియా ల లో పోస్ట్ చేసి.. ఆచూకీ తెల‌పాల‌ని రాశాడు. దీంతో సోష‌ల్ మీడియా లో ఫో టో చూసిన ఒక వ్య‌క్తి రాజు కు ఫోన్ చేశాడు. దీంతో కుటుంబ స‌భ్యుల తో అడివివ‌రం స‌మీపంలో ఉన్న భైర‌వ‌వాక లోని ఓ బావి వ‌ద్ద ఉన్న భవాని చెప్పుల‌ను, సెల్ ఫోన్ ను చూశారు.

అయితే అక్క‌డ వీరు ఎంత గాలించినా.. భవానీ ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో భవానీ కుటుంబ స‌భ్యులు పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, భవాని కుటుంబ స‌భ్యులు భైర‌వ‌వాక లోని గ‌ల బావి లో చూస్తే.. భ‌వాని మృత‌దేహం క‌నిపించింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Visitors Are Also Reading