Home » మోహన్ బాబు కి ఎస్పీ బాలు మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా..?

మోహన్ బాబు కి ఎస్పీ బాలు మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా..?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోలలో మంచు మోహన్ బాబు ఒకరు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మోహన్ బాబు మొదట సైడ్ క్యారెక్టర్, ఆ తర్వాత విలన్ అలాగే హీరోగా నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు మోహన్ బాబు చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మంచి మోహన్ బాబు పేరుతో ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. ఆయన వారసులుగా మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగానే కాకుండా టాలీవుడ్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Advertisement

ఇటు మంచు మనోజ్ కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అటు మంచు లక్ష్మి కూడా నటిగా తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే మంచు మోహన్ బాబు.. బాలసుబ్రమణ్యం మధ్య ఎంతో మంచి బంధం ఉండేది. వారిద్దరూ మంచి స్నేహితులని చెప్పడానికి రెండు మాటలు సరిపోవు. అలాగే వారి ఇరు కుటుంబాలు కూడా చాలా కలిసికట్టుగా ఉండేవి. అలాంటిది వారి మధ్య ఓ పాట చిచ్చు పెట్టింది. మంచు మోహన్ బాబు మరియు కే రాఘవేంద్రరావు కాంబినేషన్లో అప్పట్లో ఓ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకు వేటూరి సుందరా మూర్తి పాటలు రాశారు.

Advertisement

ఆయన రాసిన రెండు పాటలలో చాలా బూతులు ఉన్నాయి. కానీ వాటిని చాలా అందంగా రాశారు వేటూరి. అయితే ఈ రెండు పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం తో పాడించాలని రాఘవేంద్రరావు అనుకున్నారట. కానీ దానికి ఎస్పీ బాలు ఒప్పుకోలేదట. దీంతో మంచు మోహన్ బాబు కూడా ఎస్పీ బాలును ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ ఎస్పీ బాలు దానికి అంగీకరించలేదట. దీంతో వారిద్దరూ గొడవ పడినట్లు సమాచారం. అప్పటినుంచి ఇప్పటివరకు వారి మధ్య మాటలు లేవట. కాగా రెండేళ్ల కిందట ఎస్పీ బాలు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

Visitors Are Also Reading