Home » చిరుతో అది చేసిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!!

చిరుతో అది చేసిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇప్పటి తరం వారికి ఈ హీరోయిన్ అంతగా తెలియకపోవచ్చు కానీ 1990 లో మాత్రం ఇండస్ట్రీని ఓ పక్క షేక్ చేసింది.. తన నటన అభినయం, అంద చందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించిందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా వచ్చింది అంటే సినిమా తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్మేవారు. అంతటి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు వాణి విశ్వనాథ్. దాదాపుగా సినిమా ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో 120 పైగా చిత్రాల్లో నటించింది. చాలా ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోలు అందరితో జత కట్టింది ఈ అమ్మడు..

Advertisement

 

also read:చనిపోయిన వారు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతమంటే..!!

ఈమె ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మలయాళం, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించి మెప్పించింది. 2000 సంవత్సరంలో టీవీ చంద్రన్ డైరెక్షన్లో వచ్చిన “సుసాన్న లో ” తన నటనకు గాను రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును సాధించింది. వాణి విశ్వనాధుని మాలివుడ్ యొక్క యాక్షన్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి వాణి విశ్వనాథ్ మమ్ముట్టితో ది కింగ్ అలాగే మోహన్లాల్ తో ఉస్తాదులో సురేష్ గోపి తో చింతామణి కోలాకాసేలో నటించింది. ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో ఘరానా మొగుడు మూవీలో చేసి ఘన విజయాన్ని అందుకుంది.

Advertisement

అంతేకాకుండా వాణి ఫైటింగ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకొని సినిమాల్లో చాలామంది పురుషులతో ధైర్యంగా పోరాడే పాత్రలు చేసింది. అంతేకాకుండా వాణి విశ్వనాథ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి తో జంగు మరియు భీష్మ అనే రెండు హిందీ చిత్రాల్లో నటించింది. దీని తర్వాత మలయాళ సినిమాల్లో విలన్ మరియు కమెడియన్ గా చేస్తున్న బాబురాజుతో పలు చిత్రాల్లో నటించి అతనితో ప్రేమలో పడింది. 2022లో అతన్ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన వాణి 2017 లో జయ జానకి నాయక చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ఏపీలోని టిడిపి పార్టీలో చేరింది.

also read:

Visitors Are Also Reading