Home » అలనాడు తల్లితో.. ఇప్పుడు కూతురుతో నటిస్తున్న చిరంజీవి..మామూలు క్రేజ్ కాదు..!

అలనాడు తల్లితో.. ఇప్పుడు కూతురుతో నటిస్తున్న చిరంజీవి..మామూలు క్రేజ్ కాదు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హీరోలు అందరిలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగిన హీరో. ఆరుపదుల వయసులో కూడా ఏమాత్రం తరగని పర్ఫామెన్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి ఒకప్పుడు తల్లితో ఇప్పుడు తన కూతురితో నటించారు.. మరి వారెవరో ఇప్పుడు చూద్దామా.. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కొంతమంది నటీనటుల కూతుర్లు కూడా ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ మేనక. ఈమె చిరంజీవితో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది. అప్పట్లో వీరు చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

also read:IPL 2023 : ఢిల్లీ ఫ్యాన్స్ ను చితక్కొట్టిన SRH ఫ్యాన్స్… వీడియో వైరల్

Advertisement

ఇంతకీ మేనక ఎవరయ్యా అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి మేనక అయ్యగారు కన్యాకుమారిలోని నాగర్ కోయిల్ లో జన్మించారు. ఆమె 1979లో తమిళ చిత్రం రమయి వయసుక్కు వస్తుట్టాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దాదాపుగా 125 సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పున్నమినాగు సినిమాలో చేసింది. ఈమె నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాల నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

also read:చిరంజీవితో…కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

ఇక ఆమె నట వారసురాలిగా కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మహానటి మూవీతో జాతీయ అవార్డు సంపాదించుకుంది. అసలు విషయాల్లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవితో తల్లి మేనక హీరోయిన్ గా నటించగా, కూతురు కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి బోలాశంకర్ సినిమాలో కనిపించనున్నారు. తమిళ మూవీ వేదాలంకు రీమేక్ అవుతున్న ఈ మూవీ పై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవితో హీరోయిన్గా తమన్నా నటించగా కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది.

also read:సంతోషం గా ఉండండి…మాజీ భర్త మరణం పై నటి సంచలన పోస్ట్….!

Visitors Are Also Reading