Home » టాలీవుడ్ లో కరోనా కలకలం…మెగాస్టార్ చిరంజీవికి పాజిటివ్…!

టాలీవుడ్ లో కరోనా కలకలం…మెగాస్టార్ చిరంజీవికి పాజిటివ్…!

by AJAY
Ad

టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటుండగా మరికొంతమంది కోలుకున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వచ్చిందని చిరంజీవి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

chiranjeevi

chiranjeevi

నిన్న రాత్రి నుండి స్వల్ప లక్షణాలు ఉన్నాయని హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నానని మెగాస్టార్ వెల్లడించారు. తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకుకోవాలని చిరంజీవి కోరారు. తిరిగి మీ అందరిని త్వరలోనే కలుస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి ,రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు.

Advertisement

Visitors Are Also Reading