Home » భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

by Bunty
Ad

రెండు రోజులుగా టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ జంట మరెవరో కాదు నిహారిక, చైతన్య. మెగా డాటర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక, చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. అయితే నటనకు గుడ్ బై చెప్పింది కానీ నిహారిక ఓటిటి మరియు యూట్యూబ్ లో చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

READ ALSO : హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

Advertisement

ఇదిలా ఉంటే, ఇప్పుడు నిహారిక, చైతన్య విడిపోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిహారిక ఇన్స్ స్టాగ్రామ్ లో చైతన్యను అనుఫాలో చేస్తోంది. అదేవిధంగా చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో చేయడంతో పాటు వారి పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు విడాకుల వార్తలకు బలం చేకూరింది. తాజా సమాచారం ప్రకారం నిహారిక, వెంకట చైతన్య మధ్య మనస్పర్ధలు నిజమేనని చిరంజీవి సర్ది చెప్పేందుకు రంగంలోకి దిగారని అంటున్నారు. నాగబాబుకు ఆవేశం ఎక్కువ.

Advertisement

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

Megastar Chiranjeevi blesses Niharika Konidela and Chaitanya Jonnalagadda ahead of their wedding | Telugu Movie News - Times of India

 

అందుకే చిరంజీవి ఒక్కడే వెంకట చైతన్య, అతని ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి వివాదానికి తెరదింపాలనుకుంటున్నారట. వెంకటచైతన్య తండ్రి ప్రభాకరరావు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ఆ విధంగా గొడవ పెద్దది కాకుండా, విడాకులకు దారి తీయకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిహారిక 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Visitors Are Also Reading