Home » ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చిరంజీవి.. దీని వెనుక ఇంత కథ ఉందా..?

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చిరంజీవి.. దీని వెనుక ఇంత కథ ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే పెద్దన్న హోదాలో కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటనే ప్రధాన ధ్యేయంగా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు.. అలాంటి చిరంజీవి సినీ జీవితంలో గుర్తుండిపోయే రోజు అది.. ఈ సినిమా చిరంజీవి ని అగ్ర హీరోగా మార్చేందుకు ఎంతో ఉపయోగపడిందట.. ఆ మూవీ వచ్చి 44 సంవత్సరాలు. మరి ఆ సినిమా ఏంటయ్యా అంటే ప్రాణం ఖరీదు.. అయితే ఈ చిత్రం విడుదలై 44 సంవత్సరాలు అయిన సందర్భంగా చిరంజీవి మరోసారి నెమరు వేసుకొని ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు..

ALSO READ:బాలయ్య “చెన్నకేశవరెడ్డి” మళ్లీ విడుదల..ఎందుకో తెలుసా..?

Advertisement

మీకు తెలిసినటువంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈరోజే ( సెప్టెంబర్ 22 1978 )” ప్రాణం ఖరీదు” చిత్రంతో నాకు ప్రాణం పోసి, అన్ని మీరై నన్ను ఒక పెద్దన్నలా ఇండస్ట్రీలో 44 ఏళ్లు నడిపించారు.. నన్నింతగా పైకెత్తుకుని ఆదరించినందుకు నా అభిమానుల,ప్రేక్షకులు రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అని ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మెగాస్టార్. అయితే చిరంజీవి మొదటిసారిగా నటించిన చిత్రం పునాది రాళ్లు. కానీ ఆ సినిమా తర్వాత ఆయనకు అత్యంత పేరు తీసుకొచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు.. ఈ మూవీ కే వాసు దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమాలో చిరు నరసింహ అనే పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ చిత్రంలో జయసుధ,చంద్రమోహన్, రావుగోపాలరావు ఇంకా కీలకమైన నటులు మంచి పాత్రలో నటించడమే కాకుండా జీవించేసారు. ఆ తర్వాత చిరు కు అనేక చిత్రాల్లో నటించే అవకాశాలు తన్నుకొచ్చాయని చెప్పవచ్చు. అయితే తాజా గా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారని తెలుస్తోంది.. ఏది ఏమైనా చిరు ఇండస్ట్రీలోనే గ్రేట్ హీరో అని చెప్పవచ్చు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

ALSO READ:“కృష్ణ వ్రిందా విహారి” రివ్యూ !

Visitors Are Also Reading