Home » వైజాగ్‌లో స్థలం కొన్న చిరంజీవి..ఆ స్థలం కోసం పోటీ పడి, అన్ని కోట్లు పోశారా !

వైజాగ్‌లో స్థలం కొన్న చిరంజీవి..ఆ స్థలం కోసం పోటీ పడి, అన్ని కోట్లు పోశారా !

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇందులో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఆల్బమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి ఆదివారం రాత్రి వైజాగ్ లో గ్రాండ్ గా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా విశాఖపై తనకున్న ప్రేమను చాటుకున్నారు చిరంజీవి. విశాలమైన మనసున్న వారు విశాఖ వాసులు. రామకృష్ణ బీచ్ లో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. విశాఖలో స్థలం కొన్నాను, నా చిరకాల కోరిక ఇక్కడ ఇల్లు కట్టుకొని విశాఖ పౌరుడిని కావాలని ఈ మధ్యనే భీమిలి సైడ్ స్థలం తీసుకున్నాను, అని తెలిపారు. చాలామంది రిటైర్ అయ్యాక విశాఖ లాంటి నగరంలో స్థిరపడాలనుకుంటారు. చిరు కూడా తాను ఎప్పటికైనా వైజాగ్ లో సెటిల్ అవుతానన్నారు. వచ్చే ఏడాది ఇంటి నిర్మాణం చేపడతానన్నారు చిరంజీవి.

Advertisement

అయితే చిరు వైజాగ్ లో ఇంటి స్థలం కొన్నారు అనడంతో ఇప్పుడు ఈ వార్త మరింత వైరల్ అవుతుంది. భీమిలిలో సముద్రానికి దగ్గరగా ఇంటి స్థలం కొనుగోలు చేశారని, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే సముద్రపు వ్యూ ఉండేలా పక్కా ప్లాన్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే భీమిలిలో ఇంటి నిర్మాణం కోసం మెగాస్టార్ చిరంజీవి భారీగానే ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేశారని సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ ఇంటి స్థలం కోసం దాదాపు రూ.30 కోట్లపై డబ్బు ఖర్చు చేశారని తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి ఇకపై వైజాగ్ లో ఉంటారని తెలియడంతో అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. ఇటు వైజాగ్ వాసులు కూడా చిరు చేసిన వ్యాఖ్యలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : శ్రీలంక మ్యాచ్‌లో హైడ్రామా.. క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ

Visitors Are Also Reading