మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా పై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు ఫ్లాప్ ఎరగని దర్శకుడు కొరటాల మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరో దాంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. అంతే కాకుండా ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా ముఖ్యపాత్రలో నటించడంతో డబుల్ డోస్ ఉంటుందని భావించారు.
Advertisement
కానీ ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. మెగాస్టార్ కెరీర్ లోనే వరస్ట్ సినిమా అంటూ రివ్యూలు వచ్చాయి. అంతే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొరటాల ఇలాంటి సినిమా చేయడమేంటని ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమాకు థియేటర్ లలో ఫ్లాప్ టాక్ రావడంతో విడుదలైన కొద్దిరోజులకే ఓటీటీలో విడుదలైంది. అయితే సినిమా థియేటర్ లో వచ్చినప్పుడు ప్రేక్షకులు కేవలం సినిమా మాత్రమే చూశారు కానీ సినిమాలోని మిస్టేక్స్ ను గమనించలేదు.
Advertisement
కానీ ఈ సినిమా ఓటీటీలో చూసిన తరవాత తప్పులను పట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో చిరంజీవి చేసిన ఓ భారీ మిస్టేక్ ను పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ రథాన్ని తోసే ఓ సీన్ ఉంటుంది. సినిమాలో గుట్టమ్మవారి ఆలయం వద్ద ముందు నుండి కొందరు రథాన్ని లాగుతుంటే చిరంజీవి వెనక నుండి తోస్తారు. అయితే ఆ సీన్ లో మెగాస్టార్ కాళ్లకు షూ దరించి ఉంటారు.
నిజానికి ఆలయాల్లోకి వెళ్లేటప్పుడు దేవుడికి సంబంధించిన పనులను చేసేటప్పుడు భక్తులు చెప్పులను అస్సలు ధరించరు అన్న సంగతి తెలిసిందే. కానీ మెగాస్టార్ ఆలయాల గురించే సినిమా చేసి అలా ఎలా మిస్టేక్ చేసారని నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. అయితే మరికొందరు సినిమాను సినిమాలాగే చూడాలని కానీ ఇలా చిన్న చిన్న వాటికి కూడా ట్రోల్ చేస్తే ఇక సినిమాలు చేయలేరని కామెంట్స్ చేస్తున్నారు.
Also read :
సన్నజాజి తీగలా మారిన షాలిని పాండే.. కారణం..?