Home » పూరి, ఛార్మిలకు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇస్తారా..?

పూరి, ఛార్మిలకు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇస్తారా..?

by Azhar
Ad

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా లైగర్ సినిమా వచ్చిన ఈ సినిమా తెలిసిందే. కానీ ఈ సినిమా ఊహించని విధంగా పెద్ద డిజాస్టర్ గా మారి అందరికి షాక్ అనేది ఇచ్చింది. అయితే ఈ సినిమా వల్ల నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ నిర్మాతలకు షాక్ ఇవ్వనున్నారు అని తెలుస్తుంది.

Advertisement

లైగర్ సినిమా నిర్మాతలలో ఛార్మి అలాగే పూరి జగన్నాథ్ కూడా విషయం తెలిసిందే. అందుకే తెలుగులో ఈ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ తమ నష్టాలను కొంచెం పూడ్చాలి అంటూ ఛార్మి దగ్గరకు వెళ్లగా.. మా దగ్గర ఏం లేదు అంటూ ఛార్మి వారికీ సమాధానం ఇస్తుందట. అలాగే చాల మంది డిస్ట్రిబ్యూటర్లను కలిసేందుకు కూడా ఛార్మి ఇష్టపడటం లేదు అని తెలుస్తుంది.

Advertisement

అందుకే ఛార్మి యొక్క ఈ పద్దతితో సీరియస్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఈ సమస్యను ఫిలిం ఛాంబర్ ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ తమ నష్టాలను పూడ్చిన తర్వాతే కొత్త సినిమా ఏదైనా మొదలు పెట్టాలి అనే వాదనను వినిపించాలని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ప్రస్తుతం ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ పరిస్థితి ఎలా అయ్యిందో ఛార్మి, పూరిల పరిస్థితి కూడా అలానే కాబోతుంది అని అంటున్నారు సోషల్ మీడియా జనాలు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ఓటమి.. ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు..!

మొదటి బంతి పడకుండానే 9 రన్స్ ఇచ్చిన లంక..!

Visitors Are Also Reading