Home » తెలంగాణపై కన్నేసిన చంద్రన్న.. మరో భారీ బహిరంగ సభ ఎక్కడంటే..?

తెలంగాణపై కన్నేసిన చంద్రన్న.. మరో భారీ బహిరంగ సభ ఎక్కడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టిడిపి పార్టీ బలం తెలంగాణలో తగ్గుతూ వచ్చింది. దీంతో ఆ పార్టీలో ఉన్న నేతలు అంతా టిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఈ తరుణంలో చంద్రబాబు తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓ అడుగు ముందుకు వేశారు. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాలో పెట్టిన బహిరంగ సభ సక్సెస్ అవడంతో పార్టీ వదిలి ఇతర పార్టీలలోకి వెళ్లిన నేతలపై కన్నేశారు. వారిని ఎలాగైనా మళ్ళీ టిడిపిలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

Advertisement

Also read;కొత్త ఏడాదిలో ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

Advertisement

ఈ తరుణంలోనే నిజామాబాద్ జిల్లాపై దృష్టి పెట్టింది టిడిపి అధిష్టానం. ఈ జిల్లా నుంచి కొంత మంది నేతలు వారితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది . ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంత క్యాడర్ ఉండడం వల్ల అక్కడ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ టిడిపి పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నిజామాబాద్ లో బహిరంగ సభ పెట్టడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గర్ వాపసి కింద టిడిపి పార్టీలో కొనసాగిన వారిని మళ్లీ తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు.

ఈ తరుణంలో అన్ని నియోజకవర్గల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు టిడిపి సమాయత్తమవుతోంది . ఈ విధంగా వారు అనుకున్నట్లుగా అన్ని జరిగితే మాత్రం బాన్సువాడ నిజామాబాద్ రూరల్,బోధన్ నియోజకవర్గాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టనుంది. ఈ తరుణంలో నిజామాబాద్ లో 2023 జనవరి చివరి వారంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ బహిరంగ సభకు టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించి వేరే పార్టీకి వెళ్లిన వారిని తిరిగి టిడిపిలో చేరుస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also read;నల్ల మిరియాలు ఆహారంలో కాకుండా చప్పరిస్తే కలిగే లాభాలెన్నంటే..?

Visitors Are Also Reading