Home » నాగార్జునతో ఆ తరహా సినిమా తీయనున్న చందు మొండేటి..!

నాగార్జునతో ఆ తరహా సినిమా తీయనున్న చందు మొండేటి..!

by Azhar
Ad

చందు మొండేటి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యువ డైరెక్టర్లలో ఒక్కడు. అయితే నిఖిల్ హీరోగా కార్తికేయ సినిమాతో డైరెక్టర్ గా అవతారం అనేది ఇతడు చందు మొండేటి. ఇక ఆ తర్వాత అక్కినేని హీరో నహ చైతన్యతో ప్రేమమ్ సినిమా తీసాడు. ఇక ఈ సినిమా కూడా హిట్ కావడంతో డైరెక్టర్ గా ఓ మెట్టు ఎక్కాడు. కానీ ఆ తర్వాత తీసిన కిరాక్ పార్టీ అనే సినిమాతో పాటుగా నాగ చైతన్యతో తీసిన సవ్య సాచి అనే సినిమా రెండు ప్లాప్ కావడంతో మళ్ళీ పడిపోయాడు.

Advertisement

దాంతో మళ్ళీ నిఖిల్ తోనే తనకు మొదటి హిట్ అనేది ఇచ్చిన కార్తికేయ సినిమా సీక్వెల్ అయిన కార్తికేయ 2 తీసాడు. అయితే ఈ సినిమా అనేది విడుదలకు సిద్ధంగా ఉండటంతో… ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చందు మొండేటి. అయితే అందులో భాగంగా తాజాగా పాల్గొన ఓ ఇంటర్వ్యూలో చందు మొండేటి నేను నాగార్జునతో విక్రమ్ తరహా సినిమా అనేది తీస్తాను అని ప్రకటించాడు.

Advertisement

అయితే మొదట కింగ్ నాగార్జున తన ఫెవరెట్ హీరో అని చెప్పిన చందు మొండేటి.. ఆయనతో ఓ పోలీస్ సినిమా అనేది తీస్తాను అని.. దాని కథ గురించి మేము చర్చిస్తునాం అని పేర్కొన్నాడు. ఆ సినిమా కూడా విక్రమ్ మాదిరి ఉంటుంది అన్నారు. అయితే నాగ చైతన్యతో తీసిన సవ్య సాచి అనే సినిమా హిట్ అయితే చందు మొండేటి.. అప్పుడే నాగార్జునతో సినిమా తీసేవాడని.. కానీ అది ప్లాప్ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతుంది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల.. మొదటే భారత్, పాక్ పోరు..!

లాన్ బౌల్స్ లో టీం ఇండియా గోల్డ్.. ఈ గేమ్ ఎలా ఆడుతారో…

Visitors Are Also Reading