Home » ఇండియా, పాక్ మ్యాచ్ లో వారిదే విజయం..!

ఇండియా, పాక్ మ్యాచ్ లో వారిదే విజయం..!

by Azhar
Ad
భారత్ vs పాకిస్థాన్ అని వింటేనే చాలు.. రెండు దేశాల ప్రజలలో కూడా ఏదో తెలియని ఉత్సహం.. అలాగే ఆవేశం అనేవి వస్తాయి. ఇక క్రికెట్ లో ఈ రెండు దేశాల మాధ్యమచ్ అనేది జరుగుతుంది అంటే.. ఆ కిక్ అనేది ఇంకా పెరుగుతుంది. అయితే ఈ నెల 23న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 లో భాగంగా ఇండియా, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ అనేది జరుగుతుంది. ఇక భారత జట్టులో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. భారత స్పిన్నర్ చాహల్ తాజాగా ఈ మ్యాచ్ పైన స్పందించాడు. ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలిపాడు. అయితే చాహల్ మాట్లాడుతూ.. ఇండియా, పాక్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి అనేది హై లో ఉంటుంది.
ఇక ఆటగాళ్లుగా మేము మాత్రం ఈ మ్యాచ్ ను ఓ మాములు మ్యాచ్ మాదిరే చూస్తాము. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఉండే నేను.. అందుకే ఇండియా, పాక్ మ్యాచ్ గురించి జరిగే చర్చను మాత్రం పట్టించుకోను. ఇక ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది.. ఆరోజు పరిస్థితులకు తగ్గిన విధంగా ఎవరు ఆడుతారో వాళ్ళు విజయం సాధిస్తారు అని చాహల్ అన్నాడు. అయితే గత ప్రాపంచ కప్ లో పాక్ చేతిలో ఓటమికి ఇప్పుడు ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading