Home » భారీగా భరణం ఇచ్చి భార్య నుండి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎవరో తెలుసా..?

భారీగా భరణం ఇచ్చి భార్య నుండి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎవరో తెలుసా..?

by Azhar
Ad
పెళ్లి చేసుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన మరియు ఖర్చుతో కూడుకున్న పని. డబ్బు ఉన్నవారు… కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే.. మధ్యతరగతి వారు లక్షల్లో వివాహ వేడుకను కనిస్తారు. అయితే పెళ్లి ఎంత ఖర్చుతో కూడిన పనో.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వారికీ కుదరకపోతే విడాకులు అనేవి అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన పని. మాములుగా ప్రస్తుతం పెళ్లి చేసుకునేటప్పుడు.. భార్య కట్నం తీసుకొని వస్తుంది. కానీ విడాకులు తీసుకోవాలంటే మాత్రం భర్త భార్యకు భరణం.. అంటే తాను జీవించడానికి అవసరమైన డబ్బును ఇవ్వాలి. ఇలా భారీగా భరణం ఇచ్చి భార్య నుండి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎవరో ఓ సరి చూద్దాం.
ప్రముఖ నటుడు, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవా హీరోయినా నయనతారతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. కానీ అప్పటికే రామలత్ అనే ఆవిడతో పెళ్లి అయ్యింది. దాంతో నయన్ ను పెళ్లి చేసుకోవడానికి.. తన భార్యకు 25 కోట్ల రూపాయలతో పాటుగా.. రెండు కార్లను భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్నాడు. అదే విధంగా బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్… 2003 లో అప్పటి స్టార్ హీరోయినా అయిన కరిష్మా కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లకు కూడా పుట్టిన తర్వాత 2016 లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పుడు కరిష్మాకు భరణంగా 11 కోట్లతో పాటుగా.. ఓ ఇల్లు అలాగే ఖరిదైనా కార్లు ఇచ్చాడు సంజయ్.
ఇక మరో బాలీవూడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సుస్సానే ఖాన్ ను 2000 సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలతో 2014 లో వీరు విడిపోయారు. అప్పుడు 5 కోట్లకు పైగా సుస్సానే ఖాన్ ను ఇచ్చిన హృతిక్.. తన ఆస్తిలో పిల్లకు కూడా భాగం ఉండేలా ఒప్పందం చేసాడు. ఇక మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన తొలి భార్య నందినితో విడాకులు తీసుకొని.. హీరోయిన్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. అప్పు నందినికి పవన్ కోటి రూపాయలు భరణంగా ఇచ్చాడు. కానీ తర్వాతా రేణు దేశాయ్ పవన్ తో విడిపోయినప్పుడు భరణం తీసుకోలేదు. అలాగే సమంత కూడా నాగ చైతన్యతో విడిపోయినప్పుడు భరణం తీసుకోలేదు అనే ప్రచారం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading