Home » Breaking : కరాటే కళ్యాణి పై కేసు నమోదు …!

Breaking : కరాటే కళ్యాణి పై కేసు నమోదు …!

by AJAY
Ad

హైదరాబాదులోని సింగరేణి కాలనీలో ఐదేళ్ల చిన్నారిపై అదే కాలనీకి చెందిన యువకుడు రాజు అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు గాలింపులు చేపట్టడం తో రాజు వరంగల్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తాజాగా ఈ కేసు నేపథ్యంలో సినీనటి కరాటే కళ్యాణి పై జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సాధారణంగా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను సోషల్ మీడియా ద్వారా గాని బహిరంగంగానే ప్రకటించకూడదు.

Advertisement

Advertisement

కానీ కరాటే కళ్యాణి సింగరేణి కాలనీ లో అత్యాచారానికి గురైన బాలిక వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో ఈ విషయంపై జగద్గిరిగుట్ట కు చెందిన నితీష్ అనే వ్యక్తి కరాటే కల్యాణి పై కేసు నమోదు చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి పై కేసు నమోదు అయ్యింది. ఇది ఇలా ఉంటే కరాటే కల్యాణి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కరాటే కల్యాణి రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు కూడా చేస్తోంది.

Visitors Are Also Reading