Home » ఆ వ్యక్తి విమర్శలతో ఆలోచనలో రాజమౌళి…ఆ తరవాతనే బాహుబలి…!

ఆ వ్యక్తి విమర్శలతో ఆలోచనలో రాజమౌళి…ఆ తరవాతనే బాహుబలి…!

by AJAY
Ad

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి కూడా ఒకరు. ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ దర్శకుల్లో రాజమౌళి ఒకరిగా ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తో రాజమౌళి దేశవ్యాప్తంగా జక్కన్న గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరవాత నుండి హీరోలకంటే రాజమౌళికే ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది. రాజమౌళి మేకింగ్ చూసి బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు షాక్ అవుతున్నారు. రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే చాలు అని అనుకుంటున్నారు. మన సినిమాల్లో పాత్రలు చేస్తున్నారు. అయితే అంతటి దర్శకుడిని ఓ వ్యక్తి విమర్శించారట

Rajamouli

Rajamouli

ఆ విమర్శించిన వ్యక్తి కూడా సినిమా ఇండస్ట్రీతో గానీ అసలు సినిమాలతో కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కావడం విశేషం. కానీ ఆ విమర్శలో జక్కన్న ఆలోచనలో పడి బాహుబలి తీసారట. ఆయన ఎవరో కాదు రాజమౌళి కార్ డ్రైవర్…ఈ విషయాన్ని రాజమౌళి కపిల్ శర్మ షో లో వెల్లడించారు. ఈగ సినిమా విడుదలైన తరవాత ఆ సినిమా చూసిన డ్రైవర్ కారులో వెళుతున్న సమయంలో రాజమౌళి పై సీరియస్ అయ్యారట. జంతువులు …కీటకాలపై కాకుండా మనుషులపై సినిమా చేయాలని అన్నారట. అయితే ఆ డ్రైవర్ మాటల్లో ప్రేమను చూసిన రాజమౌళి తన పై ఇంత ప్రేమ చూపిస్తున్నాడా అని అనుకున్నారట.

Advertisement

Advertisement

Also read : ద‌మ్మంటే అమ్మాయి, మాఫియా లేకుండా సినిమా తీసీ చూపించు..ఆర్జీవీకి జొన్నవిత్తుల స‌వాల్..!

సినిమాపై ఇంత ప్రేమ అభిమానాలు ఉన్నాయా అని ఆలోచనలో పడ్డాడట. ఆ తర్వాతే రాజమౌళి బాహుబలి సినిమా తీశారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేసుకుంది. అంతేకాకుండా రాజమౌళి బాహుబలి 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు. అంతే కాకుండా బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సిరీస్ లు ఉండొచ్చని చెప్పడం విశేషం.

Visitors Are Also Reading