Home » ఆరేళ్లుగా కాపురం.. భార్య తన సొంత చెల్లి తెలిసి బిత్తరపోయిన భర్త..!

ఆరేళ్లుగా కాపురం.. భార్య తన సొంత చెల్లి తెలిసి బిత్తరపోయిన భర్త..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఎవరైనా పెళ్లి తన సొంత కుటుంబం వారిని తప్ప మిగతా వారిని పెళ్లి చేసుకుంటారు. ఎక్కువగా వరుస అయిన వారిని మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ తెలియకుండా ఇక్కడ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. దాదాపు వీరు ఆరేళ్లు కాపురం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలరు. అయితే తన భార్య సొంత చెల్లి అని తెలిసి భర్త కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన కథనాన్ని రెడ్డిట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ గా మారింది. తాజాగా ఈ పోస్ట్ ను డిలీట్ చేశారు. అందులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 Also Read : ఆ స్టార్ హీరో త‌మ్ముడిని శ్రీరెడ్డి విడిచిపెట్ట‌లేదా…అత‌డి స‌క్సెస్ కోసం ఏం చేస్తుందంటే..?

Advertisement

ఓ వ్యక్తిని పుట్టిన సమయంలోనే వేరే తల్లిదండ్రులకు దత్తత ఇచ్చారు. దీంతో అసలు తన పేరెంట్స్ ఎవరో కూడా తనకు తెలియదు. ఆరేళ్ల కిందట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. వెంటనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు ఎమర్జెన్సీగా కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబ సభ్యులతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు భర్త ప్రయత్నం చేశాడు. భార్య తరపు కుటుంబ సభ్యుల్లో ఎవరి కిడ్నీ మ్యాచ్ కాలేదు. దీంతో తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడాలని టెస్ట్ ల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. వైద్య పరీక్షల తరువాత వైద్యలకు ఆశ్యర్యకరమైన విషయం తెలిసింది. 

Advertisement

Also Read :  నాని ద‌స‌రా ఫస్ట్ రివ్యూ….సినిమాలో అదే హైలెట్ అదేన‌ట‌..!

భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. డాక్టర్లు అతనికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో షాక్ కి గురయ్యాడు. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. వీరిద్దరూ అన్నాచెల్లి అని వైద్యులు నిర్థారించారు. ఈ విషయం తెలిసిన భర్త షాక్ కి గురయ్యాడు. ఆరేళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు  పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అని వాపోయాడు. రెడ్డిట్ లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. “మీరు ఇంతకు ముందు ఎలా సంతోషంగా ఉన్నారో మున్ముందు కూడా అదేవిధంగా ఉండండి. మీ సిస్టర్-వైఫ్ కి కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండండి” అని సూచించారు నెటిజన్లు. 

Also Read :  దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

Visitors Are Also Reading