Home » బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్ లో జరగబోయేవి ఇవేనా ?

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్ లో జరగబోయేవి ఇవేనా ?

by AJAY
Published: Last Updated on
Ad

బ్ర‌హ్మంగారు కాల‌జ్ఞానంలో వేల విష‌యాల‌ని చెప్పారు. ఇప్ప‌టికే వాటిలో కొన్ని నిజం అయ్యాయి. అందుకే ఆయ‌న కాల‌జ్ఞానం ప్ర‌పంచవ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యింది. దొంగ‌స్వాములు పుట్టుకురావ‌డం..ఆరేళ్ల పాప గ‌ర్భ‌వ‌తి అవ్వడం..ఆడ‌వాళ్లు మానం అమ్ముకోవ‌డం, గాంధీలాంటి మ‌హాత్ముడు స్వాతంత్య్రం తీసుకురావ‌డం ఇలా చాలా జ‌రిగాయి. అయితే బ్ర‌హ్మంగారు చెప్పిన భ‌విష్య‌త్ లో జ‌ర‌గ‌బోయే మ‌రో ప‌ది విష‌యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….
దేవీ శ‌క్తిపీఠాల‌లో ఒక‌టైన శ‌క్తి పీఠం ఆలంపూర్ జోగులాంభ‌…ఇది మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఉంది. అయితే 2032లోపు అమ్మ‌వారి కంట నీరు..స్త‌నాల నుండి పాలు కారుతాయ‌ని చెప్పారు.

brahmam gari kalagnanam

brahmam gari kalagnanam

క‌ర్నూలు జిల్లాలో యాగంటి ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వ‌రుడు అంతకంత‌కూ పెరిగి రాళ్లు మింగితాడని చెప్పారు. అయితే నందీశ్వ‌రుడి చుట్టూ తిరిగేందుకు వంద‌ల సంవ‌త్సరాల క్రితం స్థ‌లం ఉండేద‌ట‌. కానీ నందీశ్వ‌రుడు పెరగ‌టం వ‌ల్ల ఇప్పుడు స్థ‌లం లేకుండా పోయింది. 20సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి విగ్ర‌హం ఒక అంగులం పెరుగుతుంని పురావ‌స్థు శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. భార‌త దేశం అగ్ర‌రాజ్యం అవుతుంద‌ట‌. 2028 నాటికి భార‌త్ ప్ర‌పంచంలోనే అగ్ర‌దేశంగా నిలుస్తుంద‌ట‌.

Advertisement

Advertisement

also read :మ‌హిళ‌లు సాష్టాంగ న‌మ‌స్కారం చేయ‌రు.. ఎందుకో తెలుసా?

అంతే కాకుండా 2034లోపు ప్ర‌పంచ వినాశ‌నం త‌ప్ప‌ద‌ని బ్ర‌హ్మంగారు త‌న కాల‌జ్క్షానంలో చెప్పారు. యుద్దాలు భూకంపాలు వ‌చ్చి ప్ర‌పంచం వినాశ‌నం అవుతుందని బ్ర‌హ్మంగారు చెప్పారు. కొత్త‌కొత్త వైర‌స్ లు వ‌చ్చి క్ష‌ణాల్లో మ‌ర‌ణిస్తార‌ట‌. శ్రీశైలం శివుడు భ‌క్తుల‌తో మాట్లాడుతాడ‌ని కూడా బ్ర‌హ్మంగారి కాల జ్క్షానం చెబుతోంది. అంతే కాకుండా శ్రీశైలం ఆల‌యం శితిలం అవుతుంద‌ని కూడా చెప్పారు. అదే విధంగా ఆవు క‌డుపులో మ‌నిషి జ‌న్మిస్తుంద‌ని కూడా ఆయ‌న త‌న కాల జ్క్షానం లో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా గాడిత‌ప్పుతాయ‌ని…పంచాంగాలు పూర్తిగా గాడిత‌ప్పుతాయని బ్ర‌హ్మంగారు చెప్పారు.

Visitors Are Also Reading