Home » అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ ముగ్గురు వదులుకున్న సినిమాను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు..?

అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ ముగ్గురు వదులుకున్న సినిమాను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ముత్యాల సుబ్బయ్య దగ్గర ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన బోయపాటి శీను తన మొదటి మూవీ కథగా భద్రా స్టోరీ రాసుకున్నాడు. దీన్ని పోసాని కూడా చదివి చాలా బాగుందన్నారు. తన రికమండేషన్ తో సాంబా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ ను కలిసి ఈ కథ చెబితే నెక్స్ట్ మూవీ చేద్దాంలే ఆల్ ది బెస్ట్ శీను అని చెప్పి పంపారు ఎన్టీఆర్. వెంటనే బోయపాటి అల్లు అరవింద్ ను కలిశారు. కథ వినిపించి బన్నీతో సినిమా చేయాలని అన్నారు. అప్పటికే బన్నీ ఆర్య సినిమా చేస్తున్నాడు.

Advertisement

దీని రిజల్ట్ వచ్చేవరకు ఏ మూవీ చేయవద్దని అనుకున్నామని అరవింద్ సమాధానం ఇచ్చారట. బన్నీకి స్టోరీ బాగా నచ్చింది. అదే షూటింగ్ స్పాట్ లో ఉన్న దిల్ రాజును పరిచయం చేసి మంచి కథ ఉంది వినండి అని చెప్పాడు. బోయపాటి చెప్పిన స్టోరీ అంతా విన్నాక స్పాట్లోనే తనకు అడ్వాన్స్ ఇచ్చారు దిల్ రాజ్. నెక్స్ట్ మూవీ నీతోనే అని మాటిచ్చాడు. హీరోగా ప్రభాస్ ని కాంటాక్ట్ అయ్యారు. అప్పటికే చక్రం మూవీలో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇప్పట్లో డేట్స్ కుదరవని చెప్పేశాడు. దీంతో దిల్ రాజు, బోయపాటి ఆలోచిస్తున్నారు. మాస్ కామెడీ పండించే హీరో కావాలని వెతుకుతున్నారు.

Advertisement

వెంటనే ఈ రెండింటికి సెట్ అయ్యే హీరో రవితేజ అని ఆయన దగ్గరికి వెళ్లారు. సినిమా కథ విని బాగుందన్నారు. అలాగే దిల్ రాజ్ బ్యానర్ కావడంతో తను చేస్తున్న సినిమాలు కాస్త పోస్ట్ పోన్ చేసి భద్ర సినిమా కి కమిట్ అయ్యారు రవితేజ. ఆరు కోట్ల బడ్జెట్ తో మే 12 2005,100 ప్రింట్లతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటిరోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

also read:

Visitors Are Also Reading