Home » “బొంబాయి” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఎలా ఉన్నారో…? ఏం చేస్తున్నారో తెలుసా..?

“బొంబాయి” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఎలా ఉన్నారో…? ఏం చేస్తున్నారో తెలుసా..?

by AJAY
Ad

ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వాళ్ళలో కొంతమంది ఇప్పటికే సినిమాల్లో నటీ నటులుగా ఎంట్రీ ఇవ్వగా మరికొందరు సినిమాలను వదిలేసి వేరే ప్రొఫెషన్ లలో బిజీగా ఉన్నారు. కాగా ముంబై సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా తమ నటన తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 1992 సంవత్సరం లో అరవింద్ స్వామి హీరోగా మనిషా కొయిరాల హీరో హీరోయిన్ లుగా ముంబై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బొంబాయి అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ ను కూడా బొంబాయి లోనే జరపాలని అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులు సినిమా షూటింగ్ కు అనుకూలించకపోవడం తో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అంతే కాకుండా మద్రాస్ నగరం లో సెట్స్ వేసి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ లతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా సినిమాలో కవలలు గా నటించిన హృదయ్, వర్ష లు తమ నటన తో మెప్పించారు. వీరిద్దరూ ప్రముఖ దర్శకుడు జంధ్యాల కు దగ్గరి బంధువులు కావడం విశేషం. ఈ సినిమా కోసం మణిరత్నం 100 మంది కవలలను ఆడిషన్ చేశారట. కానీ ఎవరూ మణిరత్నం కు నచ్చలేదట.

ఇక ఈ సినిమా కు అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఫణి మణిరత్నం కు హృదయ్, హర్షల గురించి చెప్పారట. వారిని చూసిన వెంటనే మణిరత్నం సినిమాకు ఫైనల్ చేశారు. ఆ తర్వాత హృదయ్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమా లో ఛాన్స్ దక్కించుకున్నాడు. పెరిగి పెద్దవాడు అయిన తరవాత హృదయ్ 2012 లో కొంజం కాఫీ కొంజెమ్ కాదల్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. అంతే కాకుండా హర్ష అయితే తనకు సినిమా లు అంటే అసలు ఇష్టం లేదని చెబుతున్నాడు.

Visitors Are Also Reading