మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
Advertisement
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు బాబీ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ సినిమా ఏదో మ్యాజిక్ చేస్తుందని మందే అనుకున్నానని వ్యాఖ్యానించారు.
Advertisement
రికార్డులు సృష్టిస్తుందని అనుకున్నానని జనాలు వడ్డీతో సహా తిరిగి ఇచ్చారని చెప్పారు. సినిమా ఇంట్రడక్షన్ షాట్ ను సముద్రం బ్యాక్ డ్రాప్ లో తీశామని దాని కోసం చిరంజీవి ఏకంగా పదిరోజుల పాటు నీళ్లలో ఉన్నారని చెప్పారు. అభిమానుల అంచనాలకు తగినట్టు రావడం కోసం చిరంజీవి కష్టపడ్డారని తెలిపారు.
చిరంజీవి కష్టపడేవాళ్లను ఇష్టపడతారని అన్నారు. అభిమాని అని చెప్పుకోవడం కాళ్లమీద పడిపోవడం లాంటివి చేస్తే కాదని కష్టపడితే చిరంజీవి నిజంగా ఇష్టపడతారని తెలిపారు. ఇక చిరు కష్టం ఈ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. రీఎంట్రీ తరవాత అభిమానులకు కూడా ఈ సినిమా మెగా ట్రీట్ ఇవ్వడంతో ఫుల్ కుషీ అవుతున్నారు.
ALSO READ : Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!