పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. రీసెంట్ గా జనసేన ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా పెద్ద మొత్తంలో అభిమానులు ప్రజలు సభకు హాజరయ్యారు. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయమై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు.
Advertisement
దాంతో పవన్ కల్యాణ్ మరోసారి పొత్తులకు రెడీగా ఉన్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ మహిళానేత స్పోక్స్ పర్సన్ మరియు యాంకర్ శ్వేతారెడ్డి పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్బావ సభలో జోకుల మీద జోకులు వేస్తున్నాడు.
Advertisement
వాళ్ల పార్టీ కార్యక్రమాలకు రకరకాల పేర్లను పెట్టుకుంటారు కానీ అది చూసే జనాలకు మాత్రం సినిమాలాగే కనిపిస్తుంది. చొక్కా చింపుకుని మాట్లాడినా వ్యాన్ లు ఎక్కి మాట్లాడినా అది పొలిటికల్ మీటింగ్ లా ఉండదు. ఏ రోడ్ మ్యాప్ కావాలి ఆంధ్రాది కావాలా ఇండియాది కావాలా…రాజకీయం అంటే మూడ్ వచ్చినప్పుడు చేసేది కాదు. పెరుగన్నం తిన్నా మట్టి పాత్రలో తిన్నా అని చెప్పడం కాదు నిజంగానే మట్టి రాసుకోవాలి.
also read : విడాకుల తరవాత దర్శకనిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సమంత…ఏం చేసిందంటే..!
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్న నిన్ను నమ్మితే పోయి కేసీఆర్ దగ్గర కూర్చున్నవ్. తిరుపతిలో ఏమో చేస్తావ్ అని నిన్ను సోమువీర్రాజు నమ్ముతున్నారు. ఆయనకు కూడా ఏం తెలుసు తొందరలోనే తెలుసుకుంటారు. బీజేపీ సీఎం అభ్యర్థి అని నిన్ను ఎవరు ప్రకటించారు. మోడీ, అమిత్ షాలు ప్రకటించారా…? సోము వీర్రాజు ప్రకటించారా…? ఏం పీకావ్ అని నిన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు. అంటూ శ్వేతారెడ్డి రెడ్డి పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగింది.