సినిమా తారలు, సీరియల్ నటీనటులు బుల్లితెర స్టార్స్ మాత్రమే కాదు టాలెంట్ ఉండాలే గానీ న్యూస్ ఛానల్ లో వార్తలు చెప్పేవాళ్లు కూడా పాపులర్ అయిపోవచ్చు. ఈ విషయాన్ని పలువురు ప్రూవ్ చేశారు. సావిత్రి, సుజాత, బిత్తిరి సత్తి న్యూస్ ఛానల్ లో పనిచేసి ప్రస్తుతం టీవీ షోలు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. సుజాత, సావిత్రి విషయం పక్కన పెడితే వీరిద్దరి కంటే సత్తి డిఫరెంట్. తీన్మార్ వార్తల ద్వారా మొదటి సారి బిత్తిరి సత్తి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Advertisement
సత్తి అసలు పేరు శ్రీనివాస్ రెడ్డి కాగా తన నటనతో ఆకట్టుకుని బిత్తిరి సత్తిగానే అందర్కీ గుర్తుండి పోయాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అలియాస్ బిత్తిరి సత్తి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ గా పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేదు. కానీ తీన్మార్ వార్తల్లో సరికొత్త మ్యాజరిజం తో నిజంగానే బిత్తిరి వాడా అన్నట్టుగా నటించి బిత్తిరి సత్తి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Advertisement
తీన్మార్ వార్తలు వస్తున్నాయంటే సత్తి వచ్చే 5 నిమిషాల కోసం ప్రేక్షకులు టీవీ ముందు కూర్చునేలా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాలు టీవీ షోలు మరోవైపు ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా కచ్చితంగా సత్తితో ఓ ఇంటర్వ్యూ ఉండాల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో సత్తి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి ఇంటర్య్వూ చేయగా దానికి మంచి గుర్తింపు వచ్చింది.
అంతే కాకుండా ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ కోసం సత్తి మహేశ్ బాబును ఇంటర్వ్యూ చేశాడు.ఈ వీడియోలో మహేశ్ బాబు సత్తి కామెడీకి పడి పడి నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సత్తి ఒక్కో ఇంటర్వ్యూకు ఏకంగా 4 నుండి 5 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. దాంతో టాప్ యాంకర్స్ సైతం సత్తి ముందు తక్కువే అనిపిస్తుంది.
ALSO READ :
షో ఆఫ్ అవసరమా..? మంచు లక్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్..!