హోలీ వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలస్ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల పాటూ హైదరబాద్ నగరంలో మద్యం దుకాణాలు, బార్ లు, పబ్ లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు రోజుల పాటూ మద్యం బంద్ అని ప్రకటించడంతో మందు బాబులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే నగరంలో హోలీ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అలాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement
పోలీసుల ఆదేశాల ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. అదే సమయంలో మద్యం సరఫరా చేసే బార్లు మరియు క్లబ్ లు కూడా బంద్ కానున్నాయి. మరోవైపు నగరంలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలను కూడా పోలీసులు నిషేందించారు. వాహనాలపై రంగులు వేయకూడదని హెచ్చరికలు జారీ చేసారు.