Home » ఐపీఎల్ మినీ వేలం ఫిక్స్.. ఫ్రాంచైజీల పర్సు కూడా పెంచిన బీసీసీఐ..!

ఐపీఎల్ మినీ వేలం ఫిక్స్.. ఫ్రాంచైజీల పర్సు కూడా పెంచిన బీసీసీఐ..!

by Azhar
Ad

ప్రపంచంలోనే అత్యంత రెండో ఖరీదైన క్రీడా లీగ్ గా మన బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదే ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో బీసీసీఐ 48 వేల కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటె.. ఐపీఎల్ 2022 లో రెండు కొత్త జట్లు అనేవి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ మెగా వేలం అనేది.. ఫిబ్రవరిలో బెంగళూర్ వేదికగా బీసీసీఐ నిర్వహించింది.

Advertisement

కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 కోసం బీసీసీఐ మినీ వేలిని నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ లోని మ్యాచ్ ల కంటే ఐపీఎల్ 2023 లో మ్యాచ్ ల సంఖ్య అనేది పెరగనుంది అనేది తెలిసిందే. ఇందుకోసం ఐసీసీ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించే మినీ వేలంను ఫిక్స్ చేసింది.

Advertisement

ఈ మినీ వేలం అనేది ఈ ఏడాది మెగా వేలం ఎక్కడ జరిగిందో.. అదే బెంగళూర్ వేదికగా జరగనుంది అని తెలుస్తుంది. ఇక ఈ వేలంను ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన నిర్వహించబోతున్నారు. ఇక ఐపీఎల్ 2022 వరకు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ అనేది 90 కోట్లుగా ఉంది. కానీ ఈ మినీ వేలంనుండి అది 95 కోట్లు కానుంది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

కరోనా పాజిటివ్ తో కూడా మ్యాచ్ ఆడొచ్చు అంటున్న ఐసీసీ..!

గంగూలీని దెబ్బ కొట్టింది సీఎస్కే ఓనరా…?

Visitors Are Also Reading