టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ కు చెందిన శరణ్ అనే వ్యక్తి తనను బెల్లంకొడ సురేష్ మోసం చేసారంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదైంది. గతంలో సినిమా నిర్మాణం కోసం తాను బెల్లంకొండ సురేష్ కు రూ.85 లక్షలు ఇచ్చానని శరణ్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ అంశం పై బెల్లంకొండ సురేష్ తాజాగా స్పందించారు.
Advertisement
తన పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారని అన్నారు. తన పరువుకు బంగం కలిగించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. శరణ్ పై పరువు నష్టం దావా వేస్తానని బెల్లంకొండ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును లీగల్ గా ఎదురుకుంటానని వాడిని వదిలేది లేదంటూ బెల్లంకొండ సురేష్ వార్నింగ్ ఇచ్చారు. తనను తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు చేసిన కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
Advertisement
శరణ్ తనకు ఎన్నడూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. శరణ్ తనకు డబ్బులు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే పోలీసులు పిలిచి విచారించేవారని చెప్పారు. ఇప్పుడు శరణ్ తన కుమారుడి జోలికి వచ్చాడని..తన కొడుకు ప్రస్తుతం ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే ఇలాంటి పనులు చేసాడని ఆరోపించారు. అందరూ ఓ విషయం గుర్తుంచుకోవాలని తనకు అసలు నోటీసులు అందలేదని బెల్లంకొండ సురేష్ తెలిపారు.