Home » స్నేహితుడని నమ్మి బైక్ పై వెళ్ళింది.. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది.. ఏం జరిగిందంటే..?

స్నేహితుడని నమ్మి బైక్ పై వెళ్ళింది.. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది.. ఏం జరిగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒక్కొక్కసారి అనుకోని సంఘటనల వల్ల ప్రాణం మీదికి వస్తుంది. సరదా కోసం చేసిన పని చివరికి అనంతలోకాలకు పంపిస్తుంది. అయితే యువతి కూడా అలాగే వెళ్లి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. యువతి పేరు రమ్య ప్రసన్న. ఆదివారం రోజు సెలవు కావడంతో తన స్నేహితుడు లక్ష్మన్ అనే యువకుడితో సరదాగా గడిపేందుకు హైదరాబాద్ పరిధిలోని సంగి టెంపుల్ కు వెళ్లారు. దేవుడిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఊహించని విషాదం అలుముకుంది.

Advertisement

ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రమ్య ప్రసన్న (22) మేడ్చల్ జిల్లాలోని షాపూర్ కు చెందిన గుండి బొక్క లక్ష్మణ్ అనే స్నేహితుడితో ఆదివారం రోజు సరదాగా గడపడానికి అని హైదరాబాద్ సంగి టెంపుల్ కి వెళ్ళింది. ఇద్దరు హాయిగా ఆలయంలో దర్శనం చేసుకొని మళ్లీ ఇంటికి వెళదామని తిరుగు ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే మృత్యువు వారి వెంట పడింది. రామోజీ ఫిలిం సిటీ దగ్గర యూటర్న్ తీసుకుంటుండగా విజయవాడ వెళ్తున్నటువంటి లారీ మృత్యు రూపంలో వచ్చి ఢీకొట్టింది.

Advertisement

ఈ ఘటనలో రమ్య ప్రసన్న అక్కడే కింద పడిపోవడంతో లారీ టైర్లు ఆమె తల మీద నుంచి వెళ్ళాయి. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువకుడు తీవ్రగాయాలతో అక్కడే పడిపోయాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, యువకున్ని హయత్ నగర్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాద ఘటన తో యువతి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

also read:

Visitors Are Also Reading