Home » ముంబై ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం..!

ముంబై ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం..!

by Azhar
Ad

ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ లో చాలా మాబ్ది అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు అన్ని జట్ల కంటే ఎక్కువగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై జట్టు ఈ సీజన్ లో తమ అభిమానులను ఘోరంగా నిరాశపరుస్తుంది. అందుకే ముంబై ఫాన్స్ మొత్తం ఆ జట్టుపై కోపంగా ఉన్నారు. దాంతో సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ జట్టుకు మనుషులలే కాకుండా కందిరీగలు కూడా అభిమానులే కావచ్చు. అందువల్లే ఈ సీజన్ లో ఎందుకు సరిగ్గా ఆడటం లేదని ప్రశ్నించడానికో.. లేక తమ కోపాన్ని ప్రదర్శిండానికో తెలియదు… కానీ ముంబై జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడికి వచ్చేసాయి. ఇందుకు సాంబన్నదించిన వీడియోను ముంబై యాజమాన్యం తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Advertisement

అందులో పైన ఉన్న కందిరీగల నుండి తప్పించుకోవడానికి.. అక్కడ ఉన్న ముంబై ఆటగాళ్లు అందరూ నేలపై పడుకున్నారు. అయితే కందిరీగల వల్ల ఎవరికీ ఏ రకమైన ప్రమాదాం జరగలేదు. ఇక దీని పై అభిమానులు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. మేము చేయలేని పనిని ఈ కందిరీగలు చేసాయి ఆంటున్నారు. అయితే ముంబై జట్టు రేపు చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడబోతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లోనైనా ముంబై తమ మొదటి విజయాన్ని అందుకుంటుందా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

పాస్ లేకపోతే కోహ్లీలాగే పేస్ పెడతారు…!

ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

Visitors Are Also Reading