Home » బాధ్యత లేని జడేజా.. సీరియస్ అయిన బీసీసీఐ..!

బాధ్యత లేని జడేజా.. సీరియస్ అయిన బీసీసీఐ..!

by Azhar
Ad

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఎటువంటి ఆటగాడు అనేది అందరికి తెలిసిందే. అయితే ఆసియా కప్ కోక్సామ్ టీంతో కలిసి యూఏఈ వెళ్లిన జడేజా.. అక్కడ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఆ మ్యాచ్ తర్వాత హాంగ్ కాంగ్ తో కూడా ఆడిన జడేజా.. గాయపడ్డాడు అనే న్యూస్ బయటకు వచ్చింది. ఆ గాయం వల్ల జడేజా ఆసియా కప్ కు దూరం కూడా అయ్యాడు.

Advertisement

అయితే ఈ న్యూస్ రావడం అందరూ జడేజా ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు అనే అనుకున్నారు. కానీ తాజాగా ఈ గాయంపై జడేజాను బీసీసీఐ ఆరా తీయగా కొన్ని నమ్మలేని నిజాలు అనేవి బయటకు వచ్చాయి. జడేజా గాయ పడటానికి అసలు కారణం తెలిసింది. యూఏఈలో భారత జట్టు ఉంటున్న హోటల్ లోని స్విమ్మింగ్‌పూల్‌లో ఓ వాటర్ బేస్డ్ యాక్టివిటీలో జడేజాను పాల్గొనాల్సిందిగా బీసీసీఐ మేనేజ్మెంట్ సూచించగా జడేజా అదే పని చేసాడు.

Advertisement

కానీ ఆ యాక్టివిటీలోనే జడేజా గాయంకు గురి అయ్యి మొత్తం సిరీస్ కు దూరం అయ్యాడు అని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు జడేజాకు ఈ యాక్టివిటీ గురించి ఎవరు చెప్పారు.. అతడిని ఎవరు పంపించారు అనే విషయంపై విచారణకు బీసీసీఐ ఆదేశించినట్లు ఓ బీసీసీఐ అధికారి తాజాగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఈ సెంచరీ వారికే అంకితం..!

ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

Visitors Are Also Reading