Home » ఐపీఎల్ లో కరోనా కేసులు.. బీసీసీఐ కీలక నిర్ణయం…!

ఐపీఎల్ లో కరోనా కేసులు.. బీసీసీఐ కీలక నిర్ణయం…!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 ఇండియాలోనే పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. బయో బబుల్ లో సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎంత పకడ్బందినంగా ఈ బయో బౌల్ ను ఏర్పాటు చేసిన కరోనా వైరస్ అనేది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మొదట ఓ సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలి మిగితా అందరికి నెగెటివ్ రావడంతో బీసీసీఐ ఏం స్పందించలేదు.

Advertisement

కానీ నిన్న ఢిల్లీ జట్టులో కరోనా కేసులు 5 పెరిగాయి. దాంతో అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఆ వెంటనే ఢిల్లీ జట్టు మొత్తని క్వారంటైన్ ను పంపించారు. కానీ ఢిల్లీ జట్టు రేపు పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందువల్ల అభిమానులు ఈ మ్యాచ్ వాయిదా పడుతుంది అని అనుకున్నారు.

Advertisement

ఇప్పుడు ఈ మ్యాచ్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు లేక ప్రకారం అయితే ఈ మ్యాచ్ పూణేలో జరగాలి. కానీ ఇప్పుడు ముంబైలో ఉన్న ఢిల్లీ జట్టును పూణేకు తీసుకెళ్తే.. వారిని కరోనా పరీక్షలు చేయడానికి సమయం ఉండదు. అందుకే ఈ మ్యాచ్ వేదికను ముంబైకి మార్చింది బీసీసీఐ. ఇక రేపు మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు ఆ జట్టుకు చేసే కరోనా పరీక్షలో అందరికి నెగెటివ్ వస్తే.. మ్యాచ్ ఉంటది. లేకపోతే బీసీసీఐ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..!

గత ఏడాది విన్నర్ ను ఓడించావ్.. టేబుల్ టాపర్ చేతిలోనే ఓడిపోయావ్…!

Visitors Are Also Reading