Home » హైదరాబాద్ లో టీం ఇండియా మ్యాచ్ ఫిక్స్.. ఏ రోజు అంటే…?

హైదరాబాద్ లో టీం ఇండియా మ్యాచ్ ఫిక్స్.. ఏ రోజు అంటే…?

by Azhar
Ad

హైదరాబాద్ లో ఒక్కపుడు చాలా అంతర్జాతీయ మ్యాచ్ కు అనేవి జరిగేవి. ఉప్పల్ స్టేడియంలో సంవత్సరానికి కనీసం రెండు మ్యాచ్ లు అనేవి జరుగుతుండేవి. కానీ ఈ మధ్య మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కొనసాగుతున్న విబేధాల వల్ల స్టేడియం యొక్క బాగోగులు ఎవరు పట్టించుకోకుండా కావడంతో ఇక్కడ జరగాల్సిన మ్యాచ్ లు ఎక్కువగా వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నాయి.

Advertisement

కానీ దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో అంతర్జాతీయ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఈ నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీ అనేది పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియా అనేది ఇండియా పర్యటనకు రానుంది. ఇక్కడ మనతో సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో పోటీ పడుతుంది. అయితే ఇందులో మొదటి మ్యాచ్ మొహాలీ, రెండో మ్యాచ్ నాగపూర్ లో జరుగుతుంది.

Advertisement

ఇక ఈ సిరీస్ లో ఆఖరి మూడో టీ20 మన హైదరాబాద్ లో జరగనుంది. అయితే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన బీసీసీఐ ట్విట్టర్ వేదికగా చేసింది. అందులో ఈ విషయంని అధికారికంగా ప్రకటించింది. దాంతో కరోనా వల్ల ఐపీఎల్ మ్యాచ్ లు కూడా లైవ్ లో నేరుగా స్టేడియం వెళ్లి చూసే అదృష్టం కోల్పోయిన హైదరాబాద్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

మరోసారి కోహ్లీ కెప్టెన్సీ తెరపైకి…!

విండీస్ తో తర్వాతి మ్యాచ్ లకు రోహిత్ మిస్.. ఎందుకంటే..?

Visitors Are Also Reading