టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బండ్ల గణేష్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మొదట్లో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా సెటిల్ అయ్యాడు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ… సంచలనాలకు తెర లేపుతారు. ఇక ఈమధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య బాండింగ్ చాలా బాగుంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అందులో జల్సా, అత్తారింటికి దారేది సినిమా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఈ తరుణంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంచలన ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.
Advertisement
గురూజీకి కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి, దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చేసి… అసలు అనుకున్న కథను… సెడ్డుకు పంపిస్తాడంట కదా అని ఓ నెటిజన్ బండ్ల గణేష్ ను అడిగాడు. అయితే దానికి తన స్థాయిలో బండ్ల గణేష్ రిప్లై ఇచ్చాడు. కథలు మార్చడమే కాదు భార్యాభర్తలను, తండ్రీ కొడుకులను, గురువు శిష్యులను… ఇలా ఎవ్వరినైనా… మన గురూజీ వేరు చేస్తాడని కౌంటర్ ఇచ్చాడు బండ్ల గణేష్. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజెన్లు…. పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడా ? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
IPL 2023 : ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా?
HEROINES: వ్య*చారం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!
Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !