Home » ఇలియానాపై నిషేధం..పదేళ్ల తర్వాత బయటపడ్డ పచ్చి నిజాలు..!!

ఇలియానాపై నిషేధం..పదేళ్ల తర్వాత బయటపడ్డ పచ్చి నిజాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కొన్నేళ్ల కింద తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో యూత్ కు మత్తెక్కించిన ముద్దుగుమ్మ ఇలియానా. దేవదాస్ మూవీతో ఎంతో క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు, ఆ తర్వాత మహేష్ బాబుతో పోకిరి సినిమాలో చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. అప్పటినుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా మారింది. సౌత్ లో కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ లోకి వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలు చేసినా కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. అలాంటి ఇలియానా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు.

Advertisement

అయితే ఇలియానా బాలీవుడ్ పై ఉన్న ఇష్టంతోనే సౌత్ ఇండస్ట్రీని పక్కన బెట్టిందని చాలామంది భావించారు. కానీ ఆమె కావాలని సౌత్ సినిమాలకు పులీస్టాప్ పెట్టలేదు. దాని వెనుక ఒక బలమైన నిజం దాగి ఉంది. సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలియానాపై నిషేధం విధించిందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నిజం బయటకు వచ్చింది. దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలోనే ఇలియానా ఒక కోలీవుడ్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అయితే నిర్మాత నటరాజ్, విక్రమ్ హీరోగా నందం అనే మూవీ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాను తీసుకున్నాడు. ఆమెకు 40 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. కానీ ఏవో కారణాలవల్ల చిత్రం ఆగిపోయింది. తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని నిర్మాత అడిగితే ఇలియానా నిరాకరించిందట.

Advertisement

కావాలంటే మరో చిత్రంలో నటిస్తాం కానీ డబ్బులు తిరిగి ఇవ్వలేనని తెగేసి చెప్పింది అంట. దీంతో ఆ నిర్మాత నడిగారు సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను ఆశ్రయించారట. వాళ్లు చెప్పినా కానీ ఇలియానా వినకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ఇలియానాను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైనట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో ఈ సమస్యను ఇలియానా పరిష్కరించుకుందని, త్వరలో సౌత్ చిత్రాల్లో నటించబోతుందని సమాచారం అందుతోంది. మరి చూడాలి ఏ సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇస్తుందో..

also read:

Visitors Are Also Reading