Home » ఆ రెండు కారణాల వల్లనే బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా ?

ఆ రెండు కారణాల వల్లనే బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా ?

by Anji

నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  వయస్సు పైబడినప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా  వరుస సినిమాలు చేస్తున్నారు బాలయ్య.   అయితే బాలయ్య-లేడీ సూపర్ స్టార్ విజయశాంతిది ఎంతటి క్రేజీ కాంబినేషనో అందరికీ తెలిసిందే. అప్పట్లో వీరిది సూపర్ డూపర్ హిట్ జోడీ. వీరిద్దరీ కలయికలో వచ్చిన సినిమాలు 99 శాతం సక్సెస్ సాధించాయి. బాలకృష్ణ-విజయశాంతి కలిసి 17 సినిమాలు చేశారు. వాటిలో కేవలం 2 చిత్రాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించాయి. కె.మురళిమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ-విజయశాంతి తొలిసారి ‘కథానాయకుడు’ చిత్రంలో నటించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.  

Also Read :  స‌మంత జ్ఞాప‌కాల‌ను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?

వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ కావడంతో అక్కడి నుంచి విజయాల పరంపర ప్రారంభమైంది. ఇక ఆ తరువాత పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, ఇన్ స్పెక్టర్ ప్రతాప్, భలేదొంగ, ముద్దుల మేనల్లుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ వంటి హిట్స్ వీరి ఖాతాలో చేరాయి. ఇంత విజయవంతంగా సాగిపోయిన బాలకృష్ణ-విజయశాంతి జంట చివరిగా నటించిన ‘నిప్పురవ్వ’ చిత్రం మాత్రం ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి రెండు కారణాలని చెబుతుంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  గుండె బ‌రువెక్కింది…గుబులు మొద‌ల‌య్యింది అంటూ సింగ‌ర్ సునిత ఎమోష‌న‌ల్ పోస్ట్..!

అప్పట్లో బాలకృష్ణకి మంచి హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై ఎం.వీ.శ్రీనివాస ప్రసాద్ సుమారు రూ.4కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినటువంటి చిత్రం నిప్పురవ్వ. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గని కార్మికుల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా కోర్టులో కేసు వేయడంతో చిత్రీకరణకు దాాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. దీంతో బాలయ్య బంగారు బుల్లోడు చిత్రంతో పోటీ పడాల్సి వచ్చింది. 1993 సెప్టెంబర్ 3న ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి. బంగారు బుల్లోడు సూపర్ హిట్ కాగా.. నిప్పురవ్వ కాస్త నిరాశ పరిచింది. విజయశాంతి కోసం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మార్చడం.. అంతా కష్టపడి బంగారు బుల్లోడు విడుదల రోజునే నిప్పురవ్వ విడుదల చేయడం వంటి రెండు కారణాల వల్లనే నిరాశ తప్పలేదు. 

Also Read :  కార్తీకేయ‌ను బ్రో అని పిలిచిన అఖిల్…కానీ అత‌డి రిప్లై చూసి మండిప‌డుతున్న అఖిల్ ఫ్యాన్స్..!

Visitors Are Also Reading