Home » ఓటీటీ నుండి బుల్లితెరకు వస్తున్న బాలయ్య..!

ఓటీటీ నుండి బుల్లితెరకు వస్తున్న బాలయ్య..!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. చివరగా అఖండ సినిమాహోం సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వీరసింహ రెడ్డి సినిమాతో ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. అయితే ఈ మధ్యే బాలయ్య ఓటీటీలోకి వచ్చాడు అనేది తెలిసిందే. ఆహలో వస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా హోస్ట్ గా మారాడు బాలయ్య.

Advertisement

అయితే ఇప్పుడు బాలయ్య ఓటీటీ నుండి బుల్లి తెర మీదకు కూడా రాబోతున్నాడు అని తెలుస్తుంది. బాలయ్యతో పాటె టాలీవుడ్ సీనియర్ హీరోలుగా ఉన్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అందరూ ఇప్పటికే బుల్లితెర పైకి వచ్చేసారు. అంటే వారు అందరూ ఇప్పటికే యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య కూడా ఓ యద ద్వారానే తమ బుల్లితెర అరంగేట్రం అనేది చేయనున్నాడు.

Advertisement

తన తోటి హీరోలు నాగార్జున, వెంకటేష్ ఎప్పటి నుండో యాడ్స్ చేస్తుండగా.. మెగాస్టార్ మాత్రం ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు బాలయ్య కూడా రాబోతున్నాడు. అయితే బాలయ్య తన మొదటి యాడ్ అనేది ఓ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం చేయబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ యాడ్ శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు బాలయ్యను సినిమాల్లో చుసిన ఫ్యాన్స్.. మొదటిసారి బాలయ్యను యాడ్స్ ఎలా చూస్తారు అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా లేకపోతే మేము లేము అని గుర్తించిన పాకిస్థాన్..!

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ లో ఎవరంటే..?

Visitors Are Also Reading