Home » Video Viral : బాహుబ‌లి స్టైల్‌లో ఏనుగు ఎక్కిన ముస‌లాయన

Video Viral : బాహుబ‌లి స్టైల్‌లో ఏనుగు ఎక్కిన ముస‌లాయన

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిన‌దే. రెండు పార్టులుగా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్ర‌భాస్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ప్ర‌భాస్ న‌ట‌న, పాట‌లు, యాక్ష‌న్ స‌న్నివేశాలు ఒక్క‌టేంటి సినిమాలోని అన్నీ అంశాలు అభిమానులు విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అందుకే సినిమా వ‌చ్చి ఆరేళ్లు పూర్త‌యినా ఇప్ప‌టికీ బాహుబ‌లికి ఉన్న క్రేజ్ ఏమాత్రం త‌గ్డ‌డం లేదు.

Advertisement

Advertisement

బాహుబ‌లి రెండ‌వ పార్ట్‌లో ప్ర‌భాస్ తొండం మీద కాలు పెట్టి ఏనుగు మీద‌కు ఎక్కి కూర్చునే సీన్ ఒక‌టి ఉంటుంది. దాదాపు ఇది అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. సినిమా కు ఈ సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం బాహుబ‌లి సెట్‌లో ఓ వ్య‌క్తి ఏనుగు మీద‌కు ఎక్కాడు. ఐపీఎస్ అధికారి దీపాశు క‌బ్రా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. 20 సెక‌న్ల నిడివి గ‌ల ఈ వీడియోలో ఏనుగుల‌పై స్వారీ చేసే వ్య‌క్తి దాని ముందు నిలుచొని ఉంటాడు. ఎలాంటి సాయం లేకుండానే తొండంపై కాలు పెట్టి ఏనుగు ఎక్కి కూర్చుంటాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading