Home » మహేష్ బాబు ఫ్యాన్స్ కు నిరాశే…!

మహేష్ బాబు ఫ్యాన్స్ కు నిరాశే…!

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురుకానుంది.అయితే ఎప్పుడో 2020 లో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాథి ప్రజల ముందుకు వచ్చిన మహేష్.. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ల తర్వాత మరో సినిమాతో వచ్చారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కారణంగా 2021 లో మహేష్ బాబు సినిమా ఏది కూడా విడుదల కాలేదు. ఇక ఈ ఏడాది మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట అనే సినిమాతో అభిమానులను అలరించాడు. కానీ ఈ సినిమా కోసం చాలారోజులు ఫ్యాన్స్ ఎదురు చూడాలి వచ్చింది.

Advertisement

అయితే ఇంతకం ఎదురు చూసిన తర్వాత వచ్చిన ఆ సినిమా కూడా అంతగా ఫ్యాన్స్ అలరించలేదు అని చెప్పాలి. మొదటి రెండు రోజులు కలెక్షన్ కూడా బాగానే ఉన్నా.. తర్వాత పడిపోయాయి. అందువల్ల మళ్ళీ మహేష్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు కూడా సెట్స్ పైకి సినిమా అనేది వెళ్ళలేదు. కానీ ఈ మధ్యే చిత్ర యూనిట్ వచ్చే నెల ఆగస్టులో షూటింగ్ అనేది ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Advertisement

త్వరగా షూటింగ్ పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ ఇప్పుడు మళ్ళీ వారికి నిరాశే ఎదురుకానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆగస్టు 1 నుండి షూటింగ్స్ అనేవి నిలిపివేయాలని టాలీవుడ్ నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది. అందువల్ల ఇప్పుడు మహేష్ బాబు సినిమా ప్రారంభం మళ్ళీ ఆలస్యం కానుంది. ఆ కారణంగా ముందుగా అనుకున్నట్లు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయగలరా.. లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

కామన్వెల్త్ గేమ్స్ నుండి తప్పుకున్న నీరజ్ చోప్రా..!

మురళి విజయ్ కు బుద్ధి చెప్పిన ఫ్యాన్స్..!

Visitors Are Also Reading