Home » రాధే శ్యామ్ సినిమాపై గోగినేని సంచలన వ్యాఖ్యలు….తుస్ అంటూ పరువు తీశాడుగా…!

రాధే శ్యామ్ సినిమాపై గోగినేని సంచలన వ్యాఖ్యలు….తుస్ అంటూ పరువు తీశాడుగా…!

by AJAY
Ad

ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా రాధే శ్యామ్. మార్చి 11న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. పామిస్ట్రీ ఆధారంగా ఈ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించారు.

Advertisement

ఈ సినిమా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా ఇటలీలోనే షూటింగ్ మొదలు పెట్టారు. కానీ కరోనా కేసులు పెరగడంతో హైదరాబాద్ లోనే ఇటలీ నగర సెట్ ను వేసి షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ సినిమాకు ముందునుండి మిశ్రమ స్పందన వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం….పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

కానీ ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ కాలేకపోయింది. దాంతో పలువురు ఈ సినిమాపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు….”మీరు మీ అబద్ధాలు నిజంగా కెప్లర్ ఏం చెప్పాడంటే…. జ్యోతిష్యం అనేది గౌరవ ప్రదమైన సహేతుకమైన తల్లి ఖగోళ శాస్త్రం మూర్ఖపు చిన్న కూతురు…. బుద్ధి ఉన్నోడు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ లు చూసి డైలాగులను రాస్తారా….తుస్ అంటగా సినిమా…మరేం సినిమా తీసేముందు చేయి చూపించుకోవల్సింది విక్రమ్ ఆదిత్య తో” అంటూ పేర్కొన్నాడు. దాంతో గోగినేని కామెంట్స్ పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమాను సినిమా చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading