Home » దారుణం: బర్త్ డే అని చెప్పి అంకుల్ తో పెళ్లి చేశారు..పాపం ఆ బాలిక చివరికి..!!

దారుణం: బర్త్ డే అని చెప్పి అంకుల్ తో పెళ్లి చేశారు..పాపం ఆ బాలిక చివరికి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం మనం ఎంతో టెక్నాలజీ పెరిగి అనాగరిక సమాజం నుండి అధునాతన సమాజం వైపు చాలా వేగంగా అడుగులు వేస్తున్న రోజులు. ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా ఏమీ లేదు.. ఇద్దరు సమానంగానే ఏ పనిలో అయినా రాణిస్తున్నారు. పూర్వకాలంలో అయితే ఆడవారు వంటింటికే పరిమితం అనే అపోహతో బ్రతికేవారు.. కానీ ఈ టెక్నాలజీ కాలంలో అలాంటి పరిస్థితి పోయి ఆడది అంటే అబల కాదు సబల పరిస్థితి ఉన్నది. ఇలాంటి రోజుల్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతోంది.. అయితే తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అది ఏంటో ఒకసారి చూద్దామా..!!

తన తండ్రి వయసున్న అబ్బాయితో ఆ మైనర్ బాలికను పుట్టినరోజు వేడుక పేరుతో వివాహం జరిపించారు. చివరికి అందులో పెద్ద ట్విస్ట్ జరిగింది.. ఏంటంటే..? రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో బాల్య వివాహం చేశారు. 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి 12 సంవత్సరాలు ఉన్న బాలికను ఇచ్చి వివాహం చేశారు.. అయితే ఎవరికి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక అని చెప్పి ఈ పెళ్లి వేడుకను జరిపించారు. అయితే తనకు ఈ వివాహం ఇష్టం లేదని సదరు బాలిక తన బంధువుల ఇంటికి పారిపోయింది.

Advertisement

Advertisement

దీంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి మరి బంధువులతో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంలో ఆ పాప అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళింది.. ఈ విషయం కాస్త ఐసిడిఎస్ అధికారులకు చేరడంతో ఆ పాపను పాపిరెడ్డిగూడ వచ్చి ఆ బాలికను చేరదీశారు. దీంతో జరిగిన విషయాన్ని అంతా బాలిక చెప్పింది. పుట్టినరోజు వేడుక పేరుతో తన వివాహం చేశారని ఆ బాలిక గ్రామస్తులకు, ఐసీడీఎస్ అధికారులకు చెప్పింది. దీంతో ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

also read;

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రొక విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత మృతి..!

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ప్రారంభించ‌నున్న బాల‌కృష్ణ.. ఇక‌ ప్ర‌త్యేక‌త ఏమిటంటే..?

 

Visitors Are Also Reading