సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ లను కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం నెటిజన్ల కామెంట్స్ కు స్పందిస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాను ఎక్కువగా వాడే సెలబ్రిటీ లలో అశ్శు రెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియా స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరవాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
Advertisement
ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆశ్శు రెడ్డి బయటకు వచ్చిన తరవాత వరుస టీవీ షోలు చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ను తన యాంకరింగ్ తో అశ్శూ తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియా లో ఆస్క్ మీ…. ప్రశ్నలు అడగండి అంటూ నెటిజన్ లతో ముచ్చటించారు. అయితే ఓ నెటిజన్ “మనం లేచిపోదామా” అంటూ అడిగాడు. దాంతో జస్ట్ చిల్ అంటూ ఆశ్శూ అతడికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.