Home » ఆ సినిమాతో కోట్లలో నష్టపోయిన బడా నిర్మాతలు..!

ఆ సినిమాతో కోట్లలో నష్టపోయిన బడా నిర్మాతలు..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు. అందులో అశ్వినీదత్ ఒకరు. అయితే శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు అభిమానుల ముందుకు తెచ్చారు అశ్వినీదత్. అందులో చాలా వరకు హిట్ గానే నిలిచాయి. ఇక ఈ మధ్యే ఆయన సీతారామం అనే సినిమా తన బ్యానర్ లో తీసి మరో సూపర్ హిట్ అనేది తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Advertisement

అందులో భాగంగా తాజాగా అశ్వినీదత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా షాకింగ్ కామెంట్స్ అనేవి చేసారు. చూడాలని ఉంది అనే సినిమా వల్ల తాను కోట్లలో నష్టపోయాను అని చెప్పారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, అంజలి జవేరి కలిసి జంటగా నటించిన సినిమా చూడాలని ఉంది. ఈ సినిమాతో పాటుగా ఇందులో ఉండే యమహా నగరి అనే పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇంత హిట్ సినిమాను రీమేక్ చేసి అశ్వినీదత్ నష్టపోయారు.

Advertisement

అశ్వినీదత్ మాట్లాడుతూ.. మొదట నేను పెళ్లి సందడి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశాను అంది సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నేను, అల్లు అరవింద్ కలిసి చూడాలని ఉంది అనే సినిమాను హిందీలో అనిల్ కపూర్ తో కలిసి తీసాం. ఈ సినిమా విడుదల తర్వాత మాకు బహుమతుల రూపంలో చేరి 6 కోట్ల నష్టాలూ అనేవి వచ్చాయి అని అశ్వినీదత్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

ముంబైకి షాక్ ఇచ్చిన సచిన్ కొడుకు..!

పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్…!

Visitors Are Also Reading