సాధారణంగా నీరు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. నీరు తాగకుండా ఉడడం వల్ల కూడా చాలా నష్టాలు కలుగుతాయి. నీరు తాగకపోవడం ద్వారా శరీరం డీ హైడ్రేషన్కి గురవుతుంటుంది. అదే సమయంలో మన శరీరీంలో 60 శాతం నీరు మాత్రమే ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పని చేయడానికి సరైన మోతాదులో నీటిని తాగడం చాలా ముఖ్యం. మీ శరీరం పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. నీరు తాగకపోతే ఎలాంటి రోగాల బారిన పడుతారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఊబకాయం సమస్యతో పాటు అనేక వ్యాదులను తెస్తుంది. అటువంటి పరిస్థితిలో తక్కువ నీరు తాగడం ఊబకాయాన్ని ప్రోత్సహించడం వంటిది. అదే సమయంలో మనం సరైన మొత్తంలో తింటాం. నీరు తాగలేము. దీని కారణంగా మనకు ఎల్లప్పుడూ ఆకలిగా అనిపిస్తుంది. దీంతో చాలా సార్లు అతిగా తిని ఊబకాయానికి గురవుతుంటాం. అందువల్ల శరీరంలో తగినంత నీరు ఉండడం చాలా ముఖ్యం తక్కువ నీరు వల్ల కడుపులో మలబద్ధకం సమస్య కూడా వస్తుంది.
మనం నీరు సరిగ్గా తాగనప్పుడు మలబద్ధకం ఫిర్యాదు చాలా పెరుగుతుంది. నీటి కొరత కడుపులో యాసిడ్ ఏర్పడే వేగాన్ని పెంచుతుంది. దీంతోకడుపులో గ్యాస్ ఏర్పడడం ప్రారంభం అవుతుంది. ఇది కాకుండా తక్కువ నీరు తాగడం వల్ల గుండెల్లో మంట సమస్య ఉండవచ్చు. టీ కొరత కారణంగా నోటి దుర్వాసన సమస్య గణనీయంగా పెరుగుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల నోరు పొడిబారడం ప్రారంభిస్తుంది. నోటి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. నోటి దుర్వాసనను నివారించడానికి తగినంత నీరు తాగడం ఉత్తమం.
Also Read :
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకూడని పూజలు ! తప్పక తెలుసుకోండి !
Chanakya Niti : ఈ ఐదుగురిని నిద్ర లేపారంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది జాగ్రత్త..!