Home » APRIL 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మరిడిమాంబ పండుగలో పోలీసులను దూషించినందుకు గాను అయ్యన్నపాత్రుడిపై 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.

Ap cm jagan

Ap cm jagan

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో రెండో రోజు వైసీపీ జాబ్ మేళా నిర్వ‌హిస్తున్నారు. నిన్న హాజరైన 15 వేల మంది అభ్యర్థులలో 4 వేల మందికి ఉద్యోగ అవకాశం ల‌భించింది.

Advertisement

ఐపీఎల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్‌తో హైదరాబాద్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాత్రి 7.30 గంటలకు గుజరాత్‌-చెన్నై మధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

నిన్న ఢిల్లీకి బెంగురుకు మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టార్గెట్ ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ విఫ‌ల‌మైంది. దాంతో 16 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.

ముంబై వ‌రుస ఓట‌ముల పై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించారు. ఓటముల‌కు బాధ్య‌త త‌న‌దే అంటూ రోహిత్ శ‌ర్మ షాకింగ్ కామెంట్లు చేశాడు.

Advertisement

సంక్షోభం నేప‌థ్యంలో శ్రీలంక‌లో నిర‌స‌న‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి. మాజి శ్రీలంక కెప్టెన్ లు జ‌య‌సూర్య‌, అర్జున ర‌ణ‌తుంగ రోడ్డు పైకి వ‌చ్చి నిర‌స‌న‌ల్లో పాల్గొన్నారు. అధ్య‌క్షుడు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

 

తెలంగాణ‌లో నేడు రేపు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. వ‌ర్షం స‌మ‌యంలో ఈదురు గాలులు వ‌చ్చే అవ‌కావాలున్నాయ‌ని పేర్కొంది.

 

భువ‌న‌గిరిలో ప‌రువుహ‌త్య క‌ల‌క‌లం సృష్టించింది. రామ‌కృష్ణ అనే హోంగార్డు కొన్ని నెల‌ల క్రితం ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. దాంతో అత‌డి మామ ప‌థ‌కం ప్రకారం ట్రాప్ చేసి హ‌త్య చేయించిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

modi

కాంగ్రెస్ పార్టీలోకి ప్ర‌శాంత్ కిషోర్ చేర‌బోతున్న‌ట్టు జాతీయ‌మీడియాలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్ప‌ష్టత రావాల్సి ఉంది.

 

పీఎం కిసాన్ యోజ‌న డ‌బ్బుల‌ను ఈనెల‌లోనే ఖాతాలో వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 11వ విడ‌త‌లో భాగంగా డ‌బ్బుల‌ను ఖాతాలో జ‌మ‌చేయ‌నున్నారు.

 

Visitors Are Also Reading