Home » వ‌న్ ప్ల‌స్ నుంచి మ‌రొక స్మార్ట్ ఫోన్ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే..?

వ‌న్ ప్ల‌స్ నుంచి మ‌రొక స్మార్ట్ ఫోన్ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే..?

by Anji
Ad

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వ‌న్ ప్ల‌స్ ఇప్ప‌టికే మార్కెట్‌లోకి ఎన్నో ర‌కాలైన‌టువంటి స్మార్ట్ ఫోన్‌ల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫోన్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక యూజ‌ర్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది ఈ కంపెనీ. వన్ ప్లస్ నార్డ్ 2 టీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ఉండనుంది. ఈ ఫోన్లో పలురకాల ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోను కేవలం యూరోప్ మార్కెట్ లోనే విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కు 399 యూరోలుగా ధరను నిర్ణయించారు.

Advertisement

భారత రూపాయలలో ఈ ధర రూ. 32,100 ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేయనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే అందజేశారు. ఇది మీడియాటెక్ డైమన్ సిటీ 1300 ఎస్ఓపీ ప్రాసెసర్ వర్క్ చేయనున్నది. వన్ ప్లస్ నార్డ్ 2 టీ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే.. అదిరిపోయే రేంజ్ లో కెమెరాన్ అందజేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 ఎంపీ రియ‌ర్ కెమెరాను అంద‌జేసారు.

Advertisement

అంద‌మైన ఆక‌ర్ష‌ణీయ‌మైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉన్న‌ది. ఈ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు దిగ‌డం చాలా ఈజీ అవుతుంది. ఈ ఫోన్ బ్యాట‌రీ విష‌యానికొస్తే.. ఇందులో 4500 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం క‌ల బ్యాట‌రీని అంద‌జేసారు. ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను స‌పోర్ట్ చేయ‌నున్న‌ది. త‌క్కువ ధ‌ర‌లో ఎన్నో ఫీచ‌ర్లు అంద‌జేసిన ఈ స్మార్ట్ ఫోన్ భార‌త్‌లో క‌నుక విడుద‌ల అయితే చాలా మంది టెక్ ప్రియులు ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు చూస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : 

F3 ట్రైల‌ర్ విడుద‌ల‌.. చూస్తే మాత్రం న‌వ్వు ఆపుకోలేరు..!

పెరుగుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. చుండ్రుకు కూడా చెక్ పెట్టొచ్చా..!!

 

Visitors Are Also Reading