Home » ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. హీరో విశ్వక్ సేన్ కు మరో బంపర్ ఆఫర్..!!

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. హీరో విశ్వక్ సేన్ కు మరో బంపర్ ఆఫర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అదృష్టం అంటే మన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ దే అని చెప్పాలి. తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరోకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. సాధారణంగా సినిమా హక్కులకు సంబంధించి ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ డీల్ అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. రోజుల తరబడి చర్చలు జరిపిన తర్వాత మేకర్స్ ని సంతృప్తిపరిచే ఫిగర్ వచ్చినప్పుడు డీల్ ని ఫైనల్ చేసేస్తారు. కానీ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విషయంలో మాత్రం ఒకే డీల్ రెండు సార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. ఇక వివరాల్లోకి వెళితే.. రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ఓటిటీ ప్లాట్ఫామ్ సంస్థ ఫ్యాన్సీ రేటుకే సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఓటీటీ సంస్థ మరో బంపర్ ఆఫర్ తో మేకర్స్ ముందుకు వచ్చింది. రిలీజైన మూడు వారాల తర్వాత తమ ఓటీటి ప్లాట్ఫామ్ లో సినిమా ని స్ట్రీమ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అందుకోసం రెట్టింపు అమౌంటు ఇస్తామని చెప్పిందట. ఈ రీడీల్ వల్ల నిర్మాత ఖాతాలోకి భారీ లాభాలు వచ్చిపడటం ఖాయం.ఆ ఓటిటి సంస్థ ఇలా డబల్ ఆఫర్ తో ముందుకు రావడానికి కూడా ఒక కారణం ఉంది. వచ్చే శుక్రవారం సర్కారు వారి పాట సినిమా భారీ ఎత్తున విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆడియన్స్ దృష్టంతా దాదాపు ఆ సినిమా మీదే ఉంటుంది. ఫలితంగా విశ్వక్ సేన్ సినిమాకు థియేటర్ కౌంట్ తగ్గిపోవడం, తద్వారా వసూళ్లు పడిపోవడం ఖాయం. బహుశా సర్కారు వారి పాట సినిమా వచ్చాక విశ్వక్ సేన్ సినిమా హవా పూర్తిగా తగ్గిపోవచ్చు. అప్పుడు థియేటర్ల వద్ద ప్రేక్షకుల హంగామ అంతగా ఉండదు. అందుకే మూడు వారాల్లోనే స్ట్రీమ్ చేసే అనుమతి ఇవ్వాలని అందుకు రెట్టింపు ధర ఇవ్వడానికి సిద్ధమైపోయింది సదరు సంస్థ. సినిమాకు ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి త్వరగా ఓటిటి లో రిలీజ్ చేస్తే వ్యూవర్షిప్ వస్తుందన్నది ఆ ఓటీటీ సంస్థ ఉద్దేశం .

Advertisement

ALSO READ:

Advertisement

“రంగస్థలం” కథను చిరంజీవి నటించిన ఆ సినిమా నుండి కాపీ కొట్టారా…?

టాలీవుడ్ లో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 5 సీక్సెల్స్ ఇవే..!

 

 

 

Visitors Are Also Reading