Home » షూటింగ్ మధ్యలో రెమ్యునరేషన్ పెంచిన లైగర్ హీరోయిన్.. ఎందుకు..?

షూటింగ్ మధ్యలో రెమ్యునరేషన్ పెంచిన లైగర్ హీరోయిన్.. ఎందుకు..?

by Azhar
Ad
విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానుంది. అయితే పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ లైగర్ లో బాలీవుడ్ హీరోయిన్ విజయ్ తో జత కట్టింది. ఎందుకంటే ఈ మధ్య సౌత్ నుండి విడుదల అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ను పెడుతున్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ అలియా భట్.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో దీపికా పదుకొనె ఇలా బాలీవుడ్ హీరోయిన్స్ పెట్టి అక్కడి ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. అదే ఫార్ములాలో లైగర్ లో కూడా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండేను తీసుకున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ అంటే భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనన్య కొత్త హీరోయిన్ కావడంతో కేవలం కోటిన్నర రెన్యుమరేషన్ మాత్రమే ఫిక్స్ చేసింది చిత్రయూనిట్.
కానీ సినిమా షూటింగ్ మధ్యలో అనన్య రెమ్యునరేషన్ అనేది పెరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే కరోనా కారణంగా లైగర్ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ అనేది చేయాల్సి వచ్చింది. అందుకే అనన్య కూడా అనుకున్న కోటిన్నర కంటే మరో 25 లక్షలు అధికంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా అయిన ఈ లైగర్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి రేపు ఈ సినిమా ఏం చేస్తుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading