Home » కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పిన జ్యోతిష్కుడు..2024లో కూడా..!

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పిన జ్యోతిష్కుడు..2024లో కూడా..!

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం జ్యోతిష్యులు ముందస్తుగా జరుగబోయేది చెబుతుంటారు. ఇది ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో వేణు స్వామి అనే జ్యోతిష్యుడు చెప్పింది నిజం జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. తాజాగా కర్ణాటక ఎన్నికల్లో ఓ ప్రముఖ జ్యోతిష్యుడు కూడా జ్యోతిష్యం చెప్పాడు.  ప్రముఖ జ్యోతిష్కుడు వేదిక్ ఆస్ట్రాలజర్ రుద్రకరణ్  పర్తాప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే కాదు.. ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటుందో కూడా జోస్యం చెప్పారు.  గతంలో చేసిన  ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఏడాది మార్చి 31న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్  చేశారు. మే 13న ఫలితాలు  వచ్చిన విషయం తెలిసిందే. మే నెల బిజెపికి అనుకూలంగా లేదని ముందే చెప్పారు రుద్రకరన్.   కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బిజెపి కంటే కాంగ్రెస్కే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. కర్ణాటక పిసిసి అధ్యక్షులు డీకే శివకుమార్ గొప్ప యోగిని దశ గుండా వెళుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ తాను వారి జన్మదిన వివరాలను సేకరించి పరిశీలించినట్టు వెల్లడించారు. దాదాపు 18 రోజుల తర్వాత ఒక ట్విట్టర్ యూజర్ ఓ ప్రశ్న వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది సార్ అని అడిగారు. అందుకు రుద్రకరన్ పర్తప్ ఇలా సమాధానం చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ 123 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు.

Advertisement

Manam News
రుద్రకరణ్  మార్చిలో చెప్పిన విషయాలే ఇప్పుడు వాస్తవం అయ్మయాయి.  కాకపోతే సీట్ల విషయంలో నెంబర్లలో కొద్ది తేడా మాత్రమే ఉంది.  ఇవాళ కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో  మరోసారి తన ఫీట్లను గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలపై కూడా కామన్ చేశారు. తాను ఈ విషయాలను మార్చి నెలలోనే అంచనా వేశానని వెల్లడించారు. వారి జన్మ నక్షత్రాలు అవే చెబుతున్నాయని వివరించినట్టు తెలిపారు. తాను ఊహించినట్టే కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడి బిజెపిని గద్దె దించుతుందని వివరించారు. 2024 ఎన్నికల కోసం ఇప్పుడే పోరు ప్రారంభమైందని చెప్పలేమని తెలిపారు. కర్ణాటకలో బిజెపి ఓటమి వారిని మరింత పాటుపడేలా చేస్తుందని వివరించారు. వచ్చే నెలలో వారు మరింత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారని ముందుగానే ఊహించారు రుద్రకరన్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

గోవాలో అలాంటి పని చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన స్టార్ హీరోయిన్..!!

జల్సా రాయుడు నరేష్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading